Venu Thottempudi : 1999 లో వచ్చిన ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన హీరో వేణు ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఉరేళితే, కళ్యాణ రాముడు, సదా మీ సేవలో వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే ‘దమ్ము’ సినిమా తరువాత ఇండస్ట్రీ కి దూరమైన వేణు దాదాపు తోమిదేళ్ల తరువాత మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించారు. అయితే సినిమాల్లోకి వచ్చిన మొదట్లో అతను ఎదుర్కొన్న ఇబ్బందులను మొదటి సినిమా అనుభవాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు వేణు.

స్వయంవరం సినిమాకోసం అన్నీ సిద్ధం అయ్యాక ఆర్పి మ్యూజిక్ చేయనన్నాడు…
సినిమాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో చెన్నై లోనే ఉన్న వేణు కి త్రివిక్రమ్, సునీల్, ఆర్పి పట్నాయక్, చంద్ర సిధార్థ్ వంటి వారితో పరిచయాలు ఉన్నాయి. వీళ్లంతా అప్పట్లో రూంమేట్స్. అలా అందరం కలిసి ఎలాగోలా సినిమా చేసేద్దాం అని డిసైడ్ అయ్యారు. అలా కథ, మాటలు త్రివిక్రమ్, హీరోగా వేణు, మ్యూజిక్ ఆర్పి పట్నాయక్, డైరెక్టర్ గా చంద్ర సిధార్థ అనుకున్నాక పాటలు అన్నీ రెడీ అయ్యాయి. షూటింగ్ మొదలు పెట్టిన మూడు రోజులకు సినిమా కథకు, తీస్తున్న విధానానికి తేడా అనిపించి వేణు ఆపేసారు. సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా చేస్తుండడం మొదటి సినిమా అవ్వడంతో భయమేసి కథ అనుకున్నది ఒకటి షూటింగ్ లో ఒకటి అనిపించి కొన్నిరోజులు ఆపేసారు.

ఇక మళ్ళీ డైరెక్టర్ గోపాల్ గారితో కొంచెం పరిచయం ఉండటంతో ఆయన ద్వారా విజయ్ భాస్కర్ ను కలిసి మాట్లాడి కథ చెప్పగా మొదట ఆలోచించారు, ఆ తరువాత సన్నిహితులు చేయమంటే చేస్తానని చెప్పారట. ప్రార్థన సినిమా ప్లాప్ తరువాత మంచి కథ కోసం విజయ్ భాస్కర్ ఎదురుచూస్తున్న సమయంలో ఈ కథకు ఓకే చెప్పారట. ఇక అంతా సిద్ధం అయింది అనుకున్నాక ఆర్పి పట్నాయక్ నేను మ్యూజిక్ చేయనని చెప్పాడట. చంద్ర సిద్ధార్థ్ డైరెక్షన్ అయ్యుంటే నేను మ్యూజిక్ చేసే వాడిని లేదంటే నేను చేయను అని చెప్పడంతో వందేమాతరం శ్రీనివాస్ గారిని కలిసి ఆయనతో మ్యూజిక్ చేయించుకున్నారట. అలా స్వయంవరం సినిమా పట్టాలెక్కింది.































