ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ముందుగానే లాక్ డౌన్ విధించినాకూడా మన దేశంలో ఇంకా ఈ మహమ్మారి కట్టడికాకపోవడంతో మరోసారి మే 3 వరకు కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులతో పాటు వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. ప్రజలు ఎవరు ఇళ్ళనుండి బయటకు రావడంలేదు. ఈ కారణంగా పనులు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి సినీ నటులు, సెలెబ్రేటిస్ తమ వంతు సాయం చేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది నటీనటులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయం అందించారు. కానీ ఇప్పటి వరకు రౌడీ విజయ్ దేవరకొండ ఎటువంటి సాహయం ప్రకటించలేదు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అయితే తనవంతుగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ, పోలీసులకు తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా కరోనాపై పోరాటానికి కోటి ముప్పై లక్షలు భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఇటువంటి విపత్కర సమయంలో సహాయం అందించాడని రెండు ఛారిటీ సంస్థలకు ఏర్పాటుచేసి తాను అందరికంటే భిన్నం అని మరోసారి చాటి చెప్పాడు.




































