Connect with us

Featured

VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..

VN Adithya: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య థియేటర్ల టికెట్ ధరలు తగ్గింపు వివాదం అలాగే ఉంది. ఇది రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇటు టాలీవుడ్

Published

on

VN Adithya: టాలీవుడ్, ఏపీ ప్రభుత్వాల మధ్య థియేటర్ల టికెట్ ధరలు తగ్గింపు వివాదం అలాగే ఉంది. ఇది రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇటు టాలీవుడ్ ప్రముఖల వ్యాఖ్యలు, అటు వైసీపీ నాయకులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇలసాగుతోంది టికెట్ల వివాదం. ఇప్పటికే నాని, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.

VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..

దీనికి ప్రతిగా వైసీపీ మంత్రి పేర్ని నాని కూడా తనదైన శైలిలో కౌంటర్లు కూడా ఇచ్చారు.  ఇదిలా ఉంటే ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు తరుచు టికెట్ ధరలపై చేస్తున వ్యాఖ్యలు సమస్యను మరింత పెంచుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాతలు బలిసి ఉన్నారు’ అనే వ్యాఖ్యలు టాలీవుడ్ ఆగ్రహానికి కారణమైంది.

VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..
VN Adithya: ‘‘పదవిలో ఉన్నంత వరకు హీరో.. తర్వాత జీరో’’..! కానీ హీరో ఎప్పుడూ హీరోనే..

ఇప్పటికే నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్ .. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.  ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఘాటుగానే స్పందించారు. ‘ బలుపుంటే తప్పేంట్రా బడా చోర్’ అంటూ విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే..

‘సినిమా వాళ్లకుళ్ల బలుపెక్కువ..”ఈ మాట వినగానే ఒక్క క్షణం మనసు చివుక్కుమంది.. ఇక్కడి వాళ్ల కష్టాలు గుర్తుకు వచ్చాయి .. కానీ తర్వాత స్వాభిమానంతో ఆలోచిస్తే, నిజమే కదా ”బలుపు” ఎందుకుండకూడదు అనిపించింది.. ఈ మాట అన్నవాడు, వాడి జీవితంలో ఒక అయిదు వేల మంది పాత్రల్ని కలుస్తాడేమో పర్సనల్ గా..ఒక్క సినిమా వాడు మాత్రమే సినిమాకొకయాభై మంది చొప్పునయాభై ఏళ్లలోళ్ల రెండు లక్షలయాభైవేల పైచిలుకు పాత్రల్ని కలిసేస్తాడు..ఎంత అనుభవం వస్తుంది తర్వాత తరాలకి అందించడానికి.. ఆ మాత్రం బలుపుండచ్చు.. నీ సినిమా వాడు భూమ్మీద మనిషి మనుగడ ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోతాడు..సినిమా రూపంలో. రాజకీయ నాయకుడు గెలిచి, పదవిలో ఉన్నంత వరకే హీరో.. మిగిలిన జీవితమంతా జీరో.. కానీ సినిమా వాడు ఒకసారి హిట్ కొడితే, లైఫ్ లాంగ్ అండ్ ఆఫ్టర్ఫ్ట లైఫ్ కూడా హీరోయే..ఏదో ఒక కళలో నిష్ణాతుడికే బలుపుండచ్చు..అంటే, అరవై నాలుగు కళల సమాహారమైన మాధ్యమంలో బతికే ఇరవై నాలుగు క్రాఫ్టుల సినిమా వాడికి ఎంతైనా బలుపుండచ్చు..ఒక రాజకీయ నాయకుడి ఎన్నికల ప్రచారానికి సినిమా వాడు సాయపడతాడు.. ఒక్క సినిమా టిక్కెట్టు తెగడానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడూ, అతని ప్రచారమూ పనికి రావు.. ప్రేక్షకుడిమౌత్ టాక్ తప్ప.. మరి బలిసి కొట్టుకోడంలో తప్పేం ఉందిరా బ్లడీ ఫూల్.. అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Advertisement

Featured

Meena: రెండో పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన మీనా… డబ్బుల కోసమే అంటూ?

Published

on

Meena: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఇటీవల కాలంలో తరచూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడైతే ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారో అప్పటినుంచి మీనా రెండో పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇదివరకే పలు సందర్భాలలో రెండో పెళ్లి గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి రెండో పెళ్లి వార్తలపై స్పందించారు.

ఈ సందర్భంగా మీనా రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో దారుణమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కేవలం డబ్బు కోసమే ఇలాంటి వార్తలు రాయొద్దు రాసేటప్పుడు నిజా నిజాలు తెలుసుకొని రాయాలని ఈమె సూచించారు.

Advertisement

అలాంటి ఆలోచన లేదు..
ఇప్పటికే రెండో పెళ్లి గురించి పలు సందర్భాలలో తాను చెప్పానని ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు. తాను రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఏమాత్రం లేనని తనకు ఆ ఆలోచన కూడా లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి ఆలోచనలు కలిగి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ విషయాన్ని నేనే అందరికీ తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో నందమూరి హీరో.. మోక్షజ్ఞనే ఆలస్యమా?

Published

on

Mokshagna: మోక్షజ్ఞ పరిచయం అవసరం లేని పేరు. నందమూరి వారసుడిగా బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితం అయినటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏమి లేవు.

ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూసి ఆశలను కూడా నిరాశ చేసుకుంటున్నారు ఇలాంటి తరుణంలోనే మోక్షజ్ఞ కంటే ముందుగానే మరో నందమూరి హీరో ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలిసి బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ కంటే ముందుగా ఇండస్ట్రీలోకి రాబోయే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే..

దివంగత నటుడు హరి కృష్ణ గారికి ముగ్గురు కుమారులు అనే సంగతి మనకు తెలిసినదే. వీరి పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయనకు ఇద్దరు కుమారులు పెద్ద అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కావటం విశేషం. ఈ అబ్బాయి ఇదివరకే పలు సినిమాలలో బాలనటుడిగా నటించారు అయితే త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

వైబిఎస్ చౌదరి..
ఇండస్ట్రీలో దర్శకుడుగా ఒకానొక సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవిఎస్ చౌదరి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈయన ఒక అద్భుతమైన ప్రేమ కథ సినిమాని సిద్ధం చేశారని రీ ఎంట్రీ ద్వారానే నందమూరి తారక రామారావును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Supritha: స్ప్రైట్ లో మందు కలుపుకొని తాగాను.. అమ్మకు తెలిసి పిచ్చ కొట్టుడు కొట్టింది: సుప్రీత

Published

on

Supritha: తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సురేఖ వాణి ఒకరు. ఈమె కుమార్తె సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టకముందే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెర నటుడు అమర్ హీరోగా ఇటీవల ఓ సినిమాలో నటిస్తున్నారు ఇందులో హీరోయిన్లు సుప్రీత అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసే రీతూ చౌదరి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి దావత్ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా రీతూ సుప్రీతను వివిధ రకాల ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా ఈమెకు సుప్రీతను ప్రశ్నిస్తూ నీ కెరియర్లో జరిగినటువంటి బలుపుతో చేసిన పనులు గురించి చెప్పమని అడిగారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ కిక్ ఇచ్చే పనుల కోసం తాను స్కూల్ చదువుతున్న సమయంలోనే లైసెన్స్ లేకుండానే అమ్మ కారు వేసుకొని వెళ్లే దాన్ని ఈ విషయం తెలిసి అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపారు. అంతేకాకుండా స్ప్రైట్ లో ఆల్కహాల్ కలుపుకొని తాగానని ఒక రోజు స్కూల్ కి వెళ్లి అందరికీ కూడా పంచానంటూ ఈమెకు తెలిపారు.

Advertisement

నంబర్ బ్లాక్ చేస్తే సహించెను..
ఇక ఎవరైనా నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే అసలు సహించను. వేరే ఫోన్ నుంచి కాల్ చేసి మరి వారికి వార్నింగ్ ఇస్తాను అంతే కాకుండా నేను ఇష్టపడే అబ్బాయి వైపు చిన్నప్పుడు ఎవరైనా చూస్తే వెళ్లి కొట్టేదాన్ని అంటూ ఈ సందర్భంగా సుప్రీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!