సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్నా, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నా కొంతమంది సెలబ్రిటీ జంటలు కలిసి కొనసాగలేకపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ప్రముఖ హీరోయిన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

సోషల్ మీడియాలో జరుగుతున్న తాజా చర్చ ప్రకారం, ప్రముఖ నటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. భర్తతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను తొలగించడం, అలాగే ఆయనను అన్ఫాలో చేయడం వంటి చర్యలు తీసుకోవడంతో విడాకుల ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో ఆమె వ్యక్తిగత జీవితంపై రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ హీరోయిన్ మరెవరో కాదు, టెలివిజన్ రంగంలో ‘నాగిని’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి మౌనీ రాయ్. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె, ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా ఆమె ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు సమాచారం.
మౌనీ రాయ్ 2022 జనవరిలో దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ను వివాహం చేసుకున్నారు. గోవాలో జరిగిన ఆ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల మేళవింపుతో జరిగిన ఆ పెళ్లి అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది.
అయితే ఇటీవల ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరూ వేరుగా ఉండే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చేలా మౌనీ రాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో భర్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి ఫొటోలను మాత్రం అలాగే ఉంచడం గమనార్హం.
సెలబ్రిటీల సోషల్ మీడియా చర్యలు తరచూ ఊహాగానాలకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై మౌనీ రాయ్ లేదా ఆమె కుటుంబం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్తలు కేవలం రూమర్లుగానే కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అభిమానులు మాత్రం నిజం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.





























