పూర్ణ కీలక పాత్రధారిగా కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్యాక్డోర్’. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల కె.రాఘవేంద్రరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన టీజర్ పది మిలియన్ వ్యూస్ తెచ్చుకోగా… ట్రైలర్ ఆ మార్కును దాటిపోయే దిశగా సందడి చేస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 3 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సెన్సార్ సర్టిఫికెట్ కూడా పొందింది. ఇటీవల హైదరాబాద్ లో ఈ చిత్రబృందం విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రం పూర్తిగా మహిళ ప్రధాన కాథాంశం అని.. చక్కటి సందేశాన్ని జోడించడంలో బాలాజీ విజయం సాధించాడన్నారు.
ఈ చిత్రం తన కంటే చిన్నవాడైన యువకుడితో ప్రేమలో పడిన వివాహిత కథ ఇది. ఇక వారి అనుబంధం ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుంది.. అక్కడ నుంచి వాళ్లు ముందుకు ఎలా వెళ్తారు.. అనేదే ఆసక్తికరంగా ఉండనుంది. పూర్ణ కెరీర్లో విభిన్నమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర దర్శకుడు అన్నారు.
నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్ణ పాత్రకు దగ్గట్లు నటించిందని.. ఆమె నటనలో మంచి ప్రతిభ కనబర్చిందని తెలిపారు. బ్యాక్డోర్ ఫస్ట్లుక్ను హీరో ఆది సాయికుమార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నమైన కథాంశంతో ఈ చిత్రం విడుదల కానుంది.































