Ramoji Rao: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం తెలిసినదే. ఇక ఈయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక రామోజీరావు మరణించడంతో ఆయనకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. ఈయనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇక ఈయనకు తన తాతయ్య రామయ్య పేరును పెట్టారు.
ఇక ఈయనకు ఈ పేరు నచ్చకపోవడంతో ప్రాథమిక పాఠశాలలో చేరే సమయంలో తన పేరును తానే స్వయంగా రామోజీరావుగా మార్చుకున్నారు.చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా మొదట ఉద్యోగంలో చేసారు. అయితే 1962 లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టి సారించారు.ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు.
రామోజీ ఫిలిం సిటీ…
రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. ఇక హైదరాబాద్లో హాలీవుడ్ తరహా ఫిలిం సిటీని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈయన రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు. ఇలా ఈయన పత్రిక రంగంలోనూ చిత్ర పరిశ్రమలోను ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించారని చెప్పాలి.



























