AP Elections 2024: ఏపీలో అన్ని ప్రాంతాలలోని ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి అయితే పలుచోట్ల అల్లర్లు గొడవలు చోటు చేసుకున్నప్పటికీ ఎక్కడ కూడా రీపోలింగ్ సమస్య రాకుండా పోలింగ్ జరిగింది. అయితే ఎన్నికల సమయంలో రాజుకున్నటువంటి అల్లర్లు ఇప్పటికీ పలు ప్రాంతాలలో కొనసాగుతూనే ఉన్నాయి పోలీసులు పలువురు నేతలను అరెస్టు చేశారు.

ఇకపోతే ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరి ఆసక్తి ఈ ఎన్నికల ఫలితాలపైనే ఉంది ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల పోలింగ్ శాతం కూడా భారీగా పెరిగింది దీంతో కూటమి అధికారంలోకి రాబోతుందని కూటమినేతలు లేదు జగనే మరోసారి అధికారంలోకి రాబోతున్నారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇలా జూన్ 4వ తేదీ వెలువడే ఫలితాలలో ఎవరు ప్రభంజనం సృష్టించబోతున్నారనే విషయంపై ప్రతి ఒక్కరిలోను సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వచ్చేది కూటమే అంటూ కొందరు లేదు వైసిపి రాబోతుందంటూ మరికొందరు భారీ స్థాయిలో బెట్టింగులో కడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంది.
కోట్లలో బెట్టింగులు ..
సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని కొన్ని ప్రాంతాలలో కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయి. మరి ఈ ఎన్నికలలో గెలుపు ఎవరిది ఓటమి ఎవరిది అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. అయితే ఇప్పటికే కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా రాగ మరికొన్ని వైసిపికి అనుకూలంగా వస్తున్నటువంటి తరుణంలో భారీ స్థాయిలో బెట్టింగులు నడుస్తున్నాయి.





























