Nagababu: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అయితే ఇప్పుడు మెగా బ్రదర్స్ అయిన పవన్ కళ్యాణ్ , నాగబాబు ఇద్దరు కూడా రాజకీయాలలో బిజీగా గడుపుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయంగా ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో నాగబాబు సైతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ఉన్నారు. ఇక రాజకీయ పార్టీ అంటే తప్పనిసరిగా ఆ పార్టీకి మద్దతుగా మీడియా ఛానల్ అవసరం చాలా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో మీడియా చానల్స్ ఉన్న అవన్నీ వేరే పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి అందుకే జనసేన పార్టీకి మద్దతుగా నాగబాబు ఇటీవల ఎన్ మీడియా ఛానల్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.
ఇటీవల ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాగబాబు కూతురు, భార్య పాల్గొన్నారు. అయితే తాజాగా ఈ ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించడంతో ఇది కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతుంది. నాగబాబుకు తన అన్నయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే రెండు కళ్ళు లాంటి వారిని పలు సందర్భాలలో చెబుతుంటారు కానీ రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ మంచి స్థాయిలో ఉండడంతో చిరు కంటే పవనే ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది.
ఇద్దరూ సమానమే..
ఇలా తన కొత్త మీడియా ఛానల్ ఆఫీసులో కేవలం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే పెట్టడంతో నాగబాబు కు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని, రాజకీయాలలో వీరు ఎదగడంతో చిరంజీవిని ఒంటరి వాడిని చేశారని కొందరు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు .కానీ కొంతమంది మెగా అభిమానులు మాత్రం నాగబాబుకు ఇద్దరూ సమానమే అంటూ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.





























