Nara Lokesh: బెట్టింగులు అంటే ఒకప్పుడు కోళ్ల పందేల వరకు మాత్రమే ఉండేవి అయితే అనంతరం క్రికెట్ మ్యాచ్ లపై కూడా చాలామంది బెట్టింగులు కడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ అలవాటు రాజకీయాల వరకు కూడా పాకిపోయిందని తెలుస్తుంది. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ రాయుళ్ళు కోట్లలో బెట్టింగులు కాస్తూ ఉన్నారు.

ముఖ్యంగా కూటమి అధికారంలోకి రాబోతుందని కొందరు లేదు వైఎస్సార్సీపి అధికారంలోకి రాబోతుందని మరికొందరు భారీ స్థాయిలో బెట్టింగులు కట్టారు. ఇకపోతే మంగళగిరిలో గత ఎన్నికలలో భాగంగా నారా లోకేష్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రమే ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారు అంటూ పెద్ద ఎత్తున మంగళగిరిలో బెట్టింగ్ నడుస్తుందని తెలుస్తోంది.
మంగళగిరిలో నారా లోకేష్ విజయం ఖాయం అయితే ఈయనకు వచ్చే మెజారిటీపై ఏకంగా 50 కోట్ల రూపాయల వరకు బెట్టింగులు వేసినట్టు తెలుస్తోంది. 50 కోట్ల రూపాయల బెట్టింగ్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అయితే లోకేష్ పై మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వచ్చే మెజారిటీపై కూడా ఇదే స్థాయిలో బెట్టింగ్ నడుస్తోందని సమాచారం.
కోట్లలో బెట్టింగులు..
అయితే గత ఎన్నికలలో భాగంగా ఇలా పలు రాజకీయ నాయకుల మెజారిటీల గురించి భారీ స్థాయిలో బెట్టింగులు నడిచాయి ఇలా బెట్టింగ్ వేసుకున్నటువంటి వారందరూ కూడా చేతులు కాల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి అదే స్థాయిలో బెట్టింగులు వేయటం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో తెలుస్తుంది.





























