Yandamuri Veerendhranath : తెలుగు లో నవల రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీ దళం వంటి ఎన్నో నవలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించే వరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

నా కొడుకు పెళ్ళికి చిరంజీవి చేసిన సహాయం…
యండమూరి నవల హీరో అంటే చిరంజీవినే. ఆయన అనేక నవలలను చిరంజీవి హీరోగా సినిమాలు వచ్చాయి. అవన్నీ దాదాపు హిట్ గా నిలిచాయి. అదే టైం లో యండమూరి కొన్ని నవలలు బాలకృష్ణ సినిమాలుగా కూడ వచ్చాయి. రక్తాభిషేకం, అశ్వమేదం వంటివి వచ్చినా అవి హిట్ అవ్వలేదు అంటూ తెలిపారు యండమూరి. ఇక చిరంజీవి గారి కెరీర్ లో భారీ ప్లాప్ గా నిలిచినా మృగరాజు సినిమా వల్ల ఆ సినిమా నిర్మాత దేవి వరప్రసాద్ దాదాపుగా రోడ్డు మీదకి వచ్చేసాడు.

ఆ సినిమా కు యండమూరి పనిచేసారనే విషయం గురించి మాట్లాడుతూ ఆ సినిమా విషయంలో నేను ఎంటర్ అయ్యే సరికి గుణ శేఖర్, నాగబాబు ఇద్దరు కథను డెవలప్ చేసేసారు. నేను కొన్ని మార్పులు చెప్పానంతే అంతకుమించి నా కాంట్రిబ్యూషన్ సినిమాకు లేదు. ఆ పని చేసినందుకు చిరంజీవి నా కొడుకు పెళ్ళికి డబ్బు సహాయం అడిగితే ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ ద్వారా నాలుగు లక్షలు ఇప్పించాడు. అలా నా కొడుకు పెళ్ళికి ఆర్థిక సహాయం చేసాడు చిరంజీవి అంటూ చెప్పారు.

































