Yendamuri Veerendranath: సినీ రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సినీ కెరీర్లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

ఇక తాజాగా యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా ఒక్కొక్కరి నుంచి ఒక్కో ఆలోచన తీసుకొని తెరకెక్కించాము. ఇలా అందరి ఆలోచనలు కరెక్ట్ గా వర్కౌట్ కావడంతో ఈ సినిమా మంచి విజయం అందుకుందని యండమూరి ఈ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి శ్రీదేవి కలుసుకునే సన్నివేశం కోసం పెద్ద చర్చ జరిగింది. చిరంజీవి దగ్గర నలుగురు పిల్లలు ఉంటారు. వీరిలో ఒక అమ్మాయికి వైద్యం చేయించడం కోసం డబ్బు అవసరమవుతుంది. అయితే అప్పట్లో చంద్రమండలంలోకి వెళ్లే వారికి డబ్బులు ఇస్తామని ప్రకటిస్తారు. చిరంజీవిని చంద్రమండలంలోకి పంపించి అక్కడ శ్రీదేవి చిరంజీవిని కలపాలని ప్లాన్ చేశారు.
హిమాలయాలలో కలుసుకోవడం…
ఇక ఈ విషయంపై చిరంజీవి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చంద్రమండలంలోకి వెళ్లి హీరోయిని కలుసుకోవడం ఏంటి? చంద్ర మండలంలో రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం ఉంటాయి అక్కడ కలుసుకోవడం ఏంటి? మూలికల కోసం హిమాలయాలకు వెళ్ళినపుడు అక్కడ కలుసుకొనేలా ఉంటే బాగుంటుందని చిరంజీవి గారు చెప్పారు. ఇక ఆ మాట విన్న రాఘవేంద్రరావు ఈ ఆలోచన బాగుందని, అదే సీన్ పెట్టారని, యండమూరి ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఈ విషయాన్ని బయటపెట్టారు.































