Yash said sorry telugu media : కేజీఎఫ్ సినిమాతో యష్ క్రేజ్ ఇండియా మొత్తం ఫుల్లుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంగతి చెప్పక్కర్లేదు. యష్ కు ఫుల్ క్రేజ్ ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల ముందస్తు వ్యాపారం చూస్తుంటే అది అర్థమవుతుంది. ఇక మొన్న ముంబై వెళ్ళినపుడు రాకీబాయ్ క్రేజ్ బాలీవుడ్ కి తెలిసింది. రాకీ భాయ్ ని చూడడానికి అంతమంది అభిమానులు వస్తారని ఎవరు ఊహించలేదు.

సింహాచల అప్పన్న దర్శనం… మీడియా కు క్షమాపణలు….
గతంలో లో పుష్ప ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరు వెళ్లిన బన్నీ కి చేదు అనుభవం ఎదురైంది. గంటన్నర ఆలస్యం రావడంతో మీడియా నిలదీసింది. ఇంత సేపు మమ్మల్ని ఎదురుచూసేలా చేసారు టైం కి రావాలని తెలియదా అంటూ కడిగేసారు దీంతో బన్నీ వారికి క్షమాపణలు చెప్పారు.ఇక ఇపుడు ఇలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అయింది. అయితే ఈసారి కర్ణాటక ల కాదు ఆంధ్రాలో యష్ కెజీఎఫ్ చాప్టర్ 2 ప్రచార కార్యక్రమం కోసం విశాఖ వెళ్లారు. అక్కడ సింహాద్రి అప్పన్న దర్శనం తర్వాత మీడియా తో మాట్లాడారు. అయితే ఆలస్యం అవడంతో మీడియా ఆయన కోసం ఎదురుచూసింది.

ఇక మీడియా ఇదే విషయాన్ని అడగడంతో యష్ వారికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయం ఇపుడు బాగా వైరల్ అయింది. ఎపుడు బన్నీకి జరిగితే ఇక్కడ యష్ కి జరిగింది. సెలబ్రిటీలు మీడియా సమావేశాలన్నప్పుడు టెక్నికల్ ఇష్యూ రావడం లేదా వాళ్లకు వేరే పనుల వాళ్ళ కొంత ఆలస్యం అవడం మామూలే వారి వ్యక్తిగత సిబ్బంది సమయపాలన విషయం లో శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు. ఇక మీడియా కూడా కొంత సంయమనం పాటిస్తే మంచిది.






























