Serial Artists: సినిమాలలో నటించే హీరోయిన్లకే కాదు బుల్లితెరపై సీరియల్స్ లో నటించే హీరోయిన్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది.ఈక్రమంలోనే ప్రతిరోజూ ఎన్నో సీరియల్స్ ద్వారా పలువురు తారలు బుల్లితెర ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తూ ఉన్నారు.ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోయిన్ల కన్నా సీరియల్ హీరోయిన్ లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అదేవిధంగా వీరికి రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుతుందని చెప్పాలి.

వెండితెర హీరోయిన్లకు సినిమాకు ఇంత అని రెమ్యూనరేషన్ ఇస్తారు. అయితే బుల్లితెర హీరోయిన్ కి అలా కాదు వీరికి రోజువారి కాల్షీట్స్ ఆధారంగా పారితోషకం అందిస్తారు. ఈ విధంగా బుల్లితెర నటీమణులకు ఒక్క రోజుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బాగా పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర హీరోయిన్ ఎవరు ఎంతలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసుకుందాం..

కార్తీకదీపం సీరియల్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన నటి ప్రేమి విశ్వనాథ్ తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈమె ఒక రోజు షూటింగ్ లో పాల్గొంటే 30 వేల రూపాయల పారితోషికం తీసుకుంటారు. అదేవిధంగా వదినమ్మ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన సుజిత ఒక రోజుకు 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు.

ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్ గా సందడి చేసిన సీనియర్ నటీమణులు ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈమె ఒక రోజుకు 25 వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా రాశి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈమె ఒక్క రోజుకు 25 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న బుల్లి తెర తారలు…
చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం బుల్లితెర హీరోయిన్ స్థిరపడిన సుహాసిని ఒక రోజు కాల్షీట్ కోసం ఈమె 25 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అదేవిధంగా నవ్య స్వామి 25 వేలు, మేఘన లోకేష్ 20 వేలు, అగ్నిసాక్షి ఐశ్వర్య 20 వేలు, కార్తీక దీపం విలన్ శోభా శెట్టి ఒక రోజుకు 15 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ విధంగా బుల్లితెర నటీమణుల రోజుకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.



























