విడాకులు తీసుకున్న తన మాజీ భార్యకు కోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ.6,000 భరణం చెల్లించేందుకు ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడిన ఘటన నాగ్పూర్లో వెలుగులోకి వచ్చింది. గణపతినగర్, మన్కాపూర్కు చెందిన 28 ఏళ్ల కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే యువకుడిని పోలీస్లు అరెస్ట్ చేశారు.

వృద్ధురాలిని టార్గెట్ చేసిన దొంగ
గత ఫిబ్రవరి 22న, మనీష్నగర్ ప్రాంతంలో బైక్పై వచ్చిన కన్హయ్య, 74 ఏళ్ల వృద్ధురాలు జయకుమార్ గడే మెడలోని బంగారు గొలుసును చైన్స్నాచింగ్ చేసి పరారయ్యాడు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెల్టరోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
విచారణలో పాత కేసులూ బయటకు
దర్యాప్తులో పోలీసులు కన్హయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా, అతను గతంలోనూ ఇలాంటివే నాలుగు చైన్స్నాచింగ్లు చేసినట్లు అంగీకరించాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో తన మాజీ భార్యకు నెలవారీ భరణం చెల్లిస్తున్నట్లు చెప్పాడు. నిరుద్యోగం కారణంగా ఇతర మార్గం లేక దొంగతనాలదే ఆశ్రయించానని వెల్లడించాడు.
బంగారం కరిగించి నగదు చేసిన నిందితుడు
కన్హయ్య తన దొంగిలించిన బంగారాన్ని శ్రీ సాయి జ్యువెలర్స్ యజమాని అమర్దాస్ నఖతే వద్దకు తీసుకెళ్లి, బంగారాన్ని ముద్దగా కరిగించి నగదు తీసుకుంటుండేవాడు. పోలీసులు దర్యాప్తులో ఈ వివరాలు బయటపెట్టారు.
సాక్ష్యాలు స్వాధీనం
పోలీసులు నిందితుడి నుంచి మొబైల్ ఫోన్, దాదాపు 10 గ్రాముల బంగారం (రూ. 1.85 లక్షల విలువగలదు) స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడీ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విడాకుల తర్వాత బాధ్యతల భారం దొంగతనాల దాకా తీసుకెళ్లిన ఘటనపై న్యాయసమ్మతమైన మార్గాలే ఎంచుకోవాల్సిందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.































