YS Jagan: వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అదానీ ముడుపుల వ్యవహారం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమినేతలు అలాగే ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్న క్రమంలో ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..FBI చార్జ్ షీట్లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు.అదానీ మన రాష్ట్రంలో చాలా కంపెనీలు ఉన్నాయి ఆయనతో భేటీకి విద్యుత్ ఒప్పందానికి ఏ మాత్రం సంబంధం లేదని జగన్ తెలిపారు. నాకు లంచం ఇచ్చినట్టు చాలామంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ ఈయన ప్రశ్నించారు.
ఇలా వాస్తవాలు తెలియకుండా కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారాలను చేస్తూ నా పేరు ప్రతిష్టలకు పరువుకు భంగం కలిగేలా చేస్తున్నారు ఇకపై ఎవరైనా నా పరువు ప్రతిష్టలను దెబ్బతీసేలా కనుక మాట్లాడితే తప్పనిసరిగా వారిపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తాను అంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

YS Jagan:పరువు నష్టం దావా..
ఇకపోతే ఈయన చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా తన చెల్లి షర్మిలను ఉద్దేశించి చేశారని తెలుస్తుంది.అదానీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈమె వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని ఆయన పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని తనని అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే జగన్ ఇలా స్పందించారని తెలుస్తుంది.




























