YS Jagan Mohan Reddy: 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. 2019 ఎన్నికలలో 151 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం వై నాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగారు కానీ ఊహించని విధంగా ఎన్నికలు ఫలితాలు రావడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు నాయకులు షాక్ అయ్యారు.

ఇక కూటమిన్ 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఓటమిని ఎదుర్కొన్న తర్వాత తన ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయం గురించి ఇప్పటికే వైసీపీ నాయకులతో అలాగే ఎంపీలతో ఎమ్మెల్సీలతో భేటీ అవుతూ చర్చలు జరిపారు.
ఈ క్రమంలోనే ఇటీవల తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అందరూ తనని రాజకీయాలలో ముక్కుసూటి మనషి , రాజకీయాలలో మరి ఇంత నిజాయితీగా ఉండకూడదనీ తెలుసు, కానీ ధర్మాన్ని వీడని తెలిపారు.
నిజాయితీగా ఉండకూడదు..
ఇక వచ్చే అయితేలలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు హామీలు నెరవేర్చకపోతే తిరిగి ప్రజలు విశ్వసనీయతకు పట్టం కడతారని జగన్ తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎన్నికలలో సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని ఈ సందర్భంగా జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు మారాయి. దాడులలో నష్టపోయిన ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి తాను వస్తానని జండా మోసిన వారు ఇంకా కష్టంలోనే ఉన్నారని, వారికి ధైర్యం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందని జగన్ తెలిపారు.





























