AP politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగా ఉంటాయి. ఇకపోతే నేడు దివంగత నేత వైయస్సార్ 75 వ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇడుపులపాయలో ఇప్పటికి ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి వైయస్సార్ ని గుర్తు చేసుకున్నారు.

వైయస్సార్ ఘాట్ వద్ద షర్మిల జగన్ ఇద్దరు కూడా ఒకేసారి అక్కడికి చేరుకునేలా షెడ్యూల్ ప్లాన్ చేసిన షర్మిల నో చెప్పారని తెలుస్తుంది. ముందుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తన తండ్రికి నివాళులర్పించారు. ఇక వైయస్ విజయమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి తండ్రికి నివాళులు అర్పించి వెళ్లిన అనంతరం వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో పాటు తండ్రి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఇక ఈమెతో పాటు తల్లి విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. ఇలా తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం వైయస్ షర్మిల విజయవాడకు వెళ్లిపోయారు.
విజయవాడలో వైయస్సార్ జయంతి వేడుకలు..
విజయవాడలో నేడు కాంగ్రెస్ పార్టీ నేతలతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నారు అంతేకాకుండా ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా బలహీన పడటంతో ఆ పార్టీలో ఉన్న నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకురావడం కోసం షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కనుక సక్సెస్ అయితే తిరిగి ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడమే కాకుండా జగన్ వైసీపీ పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని తెలుస్తోంది.





























