Shyamala: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శ్యామల ఒకరు. అయితే ఈమె ప్రస్తుతం వైసీపీ పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు తన భర్తతో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరినటువంటి ఈమె ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో పర్యటనలు చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఒక మీడియా సమావేశంలో భాగంగా ఈమె పిఠాపురం నియోజకవర్గం గురించి అక్కడ పరిస్థితుల గురించి తెలిపారు. పిఠాపురంలో వంగా గీతా గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని తెలిపారు. వంగా గీత సీనియర్ నాయకురాలు అక్కడ ఎన్నో అభివృద్ధి పనులను చేశారు. తప్పకుండా ఆమె గెలుస్తుందని ఆమె గెలుపు ఖాయమైందని శ్యామల తెలిపారు.
ఇక వంగా గీతకు పోటీగా ఎన్నికల బరిలో దిగినటువంటి పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ ఈయన మాత్రం ఎంతోమంది సినిమా వాళ్ళని తెచ్చుకొని ఎన్నికలలో పోటీ చేస్తున్నారని ఈమె తెలిపారు. ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధికి మద్దతు తెలిపాలని ఈమె పిలుపునిచ్చారు.
గీతా గెలుపు ఖాయం..
పిఠాపురంలో అభివృద్ధి వంగా గీత వల్లే జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే జరిగిందని అందుకే అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలి అంటూ పిలుపునిచ్చారు. ఇలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని వంగా గీత గెలుపు ఖాయం అంటూ ఈ సందర్భంగా శ్యామల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





























