గత మూడు.. నాలుగేండ్లుగా దేశంలో ఆడ శిశు జననాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతి వెయ్యి మంది మగ శిశు జననాలకు.. ఆడ శిశు జననాలు 900 దాటడం లేదని తాజాగా ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఫర్ 2019’ నివేదిక పేర్కొంది.

2019 సంవత్సరానికి సంబంధించి ‘సెక్స్ రేషియో ఎట్ బర్త్’ (ఎస్ఆర్బి) అంశంలో నమోదైన గణాంకాలు ఆందోళనకరమని సామాజిక నిపుణులు భావిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తేడా గణనీయంగా పెరిగింది. 2018, 2017తో పోల్చితే గణాంకాలు మరింత దిగజారాయని తేలింది.































