“కైరా అద్వానీ” తెలుగులో మహేష్ బాబు సరసన “భారత్ అనే నేను, రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రాలలో మెరిసిన విషయం తెలిసిందే. అయితే అందులో “భరత్ అనే నేను” కాస్త పర్వాలేదు అనిపించినా, వినయ విధేయ రామ మాత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్ హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.
అయితే తాజాగా మన టాలీవుడ్ కి చెందిన ఇద్దరు నిర్మాతలు కైరాను సంప్రదించగా పారితోషకం విషయంలో వారికీ భారీ షాక్ ఇచ్చిందట. టాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేని కైరా కి అంత ముట్టచెప్పాలా అని వాపోతున్నారట నిర్మాతలు. అయితే బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలతో బిజీ ఉన్న ఈ భామని ఇప్పుడు తెలుగులో నటించమంటే ఆ మాత్రం అడగడంలో తప్పులేదులెండి. కానీ హిందీ సినిమాల్లో ఈ అమ్మడు క్రేజ్ చూసాక మాత్రం నిర్మాతలు ఈమెనే కావాలనుకుంటున్నారు. అక్కడ చిన్న హీరోల నుండి, స్టార్ హీరోల వరకు మంచి డిమాండ్ ఉంది ఈ భామకు. అందుకే ఈ భామ సౌత్ లో కూడా భారీగా డిమాండ్ చేస్తోందట.
ఇప్పటికే తెలుగులో వరుణ్ తేజ్ సినిమా కోసం, రామ్ చరణ్ సినిమా కోసం కైరాను సంప్రదిస్తే 5 కోట్లు డిమాండ్ చేసిందట ఈ ముద్దుగుమ్మ. 5 కోట్లు ఇస్తే కాల్షీట్లు అడ్జస్ట్ చేస్తాను అని నిర్మొహమాటంగా చెప్పేసిందట. ఆమె మాటలకూ షాక్ తిన్న నిర్మాతలు చేసేదేమిలేక పూజ, రష్మిక లతో సర్దుకుపోదాం అని భావిస్తున్నారట.



























