Connect with us

Featured

గోవు తోకలో నుండి ఒక్క వెంట్రుకతో ఇలా చేస్తే మీ జీవితం నిజంగా మారిపోతుందట..!! ఎలానో తెలుసుకోండి.

Published

on

గోమాతను చూడగానే తినడానికి ఏదైనా పెట్టి ఎంతో భక్తితో పూజించే సాంప్రదాయం మనది. అలాగే ఎక్కడైనా కనిపించినప్పుడు గోవును నిమురుతూ మనసులో ఏదైనా అనుకుంటే అవి నెరవేరుతాయని ఆస్తికుల నమ్మకం. అయితే ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి మీ కాలి బొటన వేలు కి కట్టి మీ ఒంట్లో ఏదైనా నొప్పి ఉన్నచోట ఆ బొటన వేలితో తొక్కుతూ ఉండడం వలన ఆ నొప్పి తగ్గుతుందని చాలా మంది గాఢంగా విశ్వసిస్తారు. కొందరు స్వామీజీలు, ఆధ్యాత్మిక పండితుల కరవాలం(చేతి)లో తాడు లేదా విసనకర్ర కు తెల్లటి దారాలు లాంటి వస్తువులు ఉంటాయి. ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాటితో వెన్నుపై తట్టి మరీ ఆశీర్వదిస్తారు. అయితే ఆ ఈకలు ఏమిటో చాలా మంది పరిశీలనాత్మకంగా చూసి ఉండరు.

ఆ వస్తువుల్లో గోవుతోకలోని వెంట్రుకలు ఉండడం వల్ల వాటిలోని మహత్తరమైన ఎనర్జీ.. ఆశీర్వాదం తీసుకున్న వారిలోకి ప్రవేశిస్తుందట. ఆప్పుడు ఆ మనిషిలోని సమస్యలు తొలగిపోతాయట. ఇంట్లో ఎవరికయినా దిష్టి తగిలితే గోవుతోకలోని వెంట్రుకనీ, కొంచెం కుంకుమను కాగితంలో చుట్టి దాన్ని ఒక ఖాళీ తావీజు లో పెట్టుకుని కట్టి మెడలో వేసుకోవడం వలన ఎప్పటికీ జీవితంలో దిష్ఠి అనేదే తగలదట. ఇక గోపూజ విషయానికి వస్తే..

Advertisement

అసలు గోపూజ అనేది ఒక సామాజిక అవసరాన్ని బట్టి ఒక ఆచారంగా పుట్టిందనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయం ప్రధాన వృత్తి అయిన మన సమాజంలో గోవుకు ఎంతగానో విశిష్టత ఉంది. అందుకే గోకులాస్టమి , గోవత్స ద్వాదశి (ఆశ్వయుజ బఖుళ ద్వాదశి నాడు), కార్తీక మాస పూజలు కార్తీక శుద్ద పాఢ్యమి నుండి బహుళ అమావాస్య వరకు జరుపుతారు. వీటిలో భాగంగా గోపూజలు చేస్తారు. అసలు చెప్పాలంటే ఆవును ప్రతిరోజూ పూజింపమని మన పూర్వీకులు మాట. నిత్య జీవితానికి ఉపయోగపడే గోవును పూజించమనో, రక్షించమనో చెబితే పట్టించుకోరని దేవుడి పేరిట పుణ్యాల ఆశ చూపారని బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు మాట. ఇక..

మన ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కనిపించే గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. విజ్ఞాన పరంగా చూసినట్లైతే గోవు పంచితం క్రిమి సంహారిగాను (రసాయ పదార్థం) ఉపయోపడుతుందట. అంతేకాకుండా గోవు ఇచ్చే పాలు తల్లి పాలతో సమానంగా శ్రేష్టమయినవట. అలాగే..

దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే‘గోపూజ’కి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయట. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉం టాయి. ఆవు నుదిటి భాగంలో శివుడు, కొమ్ముల చివరలో మూడుకోట్ల యాభైలక్షల తీర్థాలు వుంటాయట. వాటిపై చల్లిన నీటిని సేవిస్తే… త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుంది. నుదుట న శివుడు ఉంటాడట.. కనుక అక్కడ శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ… బిళ్వ దళాల తో పూజిస్తే… సాక్ష్యాత్తు కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందట. గోవు నాసికలో సుబ్రహ్మణ్యస్వామి వుండటం అక్కడ పూజిస్తే సంతాన నష్టం ఉండదట. ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉం టారట. వారిని స్వర్గలోక వైద్యులు అంటారట. అందువల్ల ఆవు చెవిని పూజిస్తే… సమస్త రోగాల నుండి విముక్తి అవుతుందంటారు. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారు. వారిని పూజిస్తే… అజ్ఙానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయట. ఆవు నాలికపై వరుణ దేవుడు వుండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి ప్రాప్తిస్తుందట. ఇక..
ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి.. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలుంటారట. కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవట. పుణ్యలోకప్రాప్తి లభిస్తుందట. ఆవు పెదవుల్లో ప్రాతః సంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట. ఆవు కంఠంలో ఉండే ఇంద్రుడిని పూజిస్తే. ఇంద్రియ పాటవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ, కామమోక్షాలు కలుగు తాయట. ఆవు గిట్టల చివర ‘నాగదేవతలు’ ఉంటారు. వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందట. అంతేకాక భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట. అందుకే గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి కలుగుతుందట. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట. ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత, సౌందర్యం లభిస్తాయట.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: ఆవిడ నన్ను ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది: వేణు స్వామి రియల్

Published

on

Venu Swamy: వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు. ఈయన ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతోమంది సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచారు. కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఈయన పెద్ద ఎత్తున అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.

ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలిసి రీల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలోని డైలాగుకు రీల్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే తాజాగా మరొకరి వీడియో ద్వారా ఈయన అభిమానుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే నాగార్జున సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించిన మన్మధుడు సినిమాలోని ఒక సీన్ రీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సోనాలి బింద్రే ఇద్దరు ప్యారిస్ వెళ్లగా అక్కడ బ్రహ్మానందంతో ఓ సన్నివేశం వస్తుంది. మీ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంటూ నాగార్జున బ్రహ్మానందం ని అడగడంతో అందుకు ఆయన చెబుతూ మొదట ఆమె నన్ను ప్రేమించింది తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అనే డైలాగును వేణు స్వామి కూడా రీ క్రియేట్ చేశారు.

Advertisement

ఊపిరి పీల్చుకో..

ఇలా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వామ్మో వేణు స్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా సోషల్ మీడియా ఇక ఊపిరి పీల్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా జ్యోతిష్యం చెబుతూనే వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం రీల్స్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారని చెప్పాలి.

https://www.instagram.com/reel/C5oDUlhxisr/?utm_source=ig_embed&ig_rid=c69f6a00-74ea-461b-b532-7e7a5316f48a

Advertisement

Continue Reading

Featured

Rashmika: నాకంటే అందగత్తెలు ఉన్నారు.. రష్మిక కామెంట్స్ వైరల్!

Published

on

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా స్టార్ డం గురించి ఈమె మాట్లాడారు.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే నాకంటే ఎంతో అందమైన అమ్మాయిలు ఉన్నారు అలాగే బాగా నటించగలిగే వారు ఉన్నారు వారందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని తెలిపారు.

ఇలా నేను ఇక్కడ వాళ్లు అక్కడ ఉండటానికి కారణం అదృష్టం మాత్రమేనని ఈమె తెలిపారు. నాకు అదృష్టం రావడంతో ఇక్కడికి వచ్చానని ఈమె తెలియజేశారు. ఇలా వచ్చిన అదృష్టాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకొని నన్ను నేను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేశానని రష్మిక తెలిపారు.

Advertisement

పతనానికి కారణం..
సినిమా ఇండస్ట్రీలో అని మాత్రమే కాదు ఏ రంగంలో అయినా కూడా జయాలు అపజయాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి అయితే మనం విజయం సాధించినప్పుడు ఆ పొగరు తలకెక్కించుకోకూడదు అలా ఎక్కించుకున్నాము అంటే ఆ ప్రభావం మన మనసుపై పడుతుందని అది పతనానికి కారణం అవుతుంది అంటూ రష్మిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. ఇది వారందరికీ దక్కిన గౌరవం అంటూ?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం  ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!