జేడీ చక్రవర్తి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనది ఒక ప్రత్యేక స్థానం. అందరు హీరోలు వేరు.. జేడీ చక్రవర్తి వేరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. అలాగే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలు కూడా ఎక్కువే. ఆయన నటించిన సినిమాలు చాలా తక్కువ అయినప్పటికీ.. ఆయన నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయవంతం అయ్యాయి. జేడీ చక్రవర్తి.. ఆయన అనుకున్న సినిమాల్లో మాత్రమే నటించారు.
అందుకే ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటించాల్సి వచ్చింది. కానీ.. ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు జేడీ చక్రవర్తి. ఆయన ఇండస్ట్రీలోకి రావడం రావడమే ఆయనకు శివ సినిమాలో చాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆయన విలన్ గా నటించాడు. నిజానికి.. చక్రవర్తి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు కానీ.. ముందు విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
శివ రిలీజ్ కాకముందే నాగార్జున నాకు వేరే సినిమాలో అవకాశం ఇప్పించారు
Advertisement
శివ సినిమాలో హీరో నాగార్జున అని తెలుసు కదా. ఆ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు జేడీ చక్రవర్తి. అయితే.. అప్పట్లో నాగార్జునతో చక్రవర్తికి రిలేషన్ షిప్ ఉండేదట. అందుకే.. శివ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాలో అవకాశం ఇప్పించారట నాగార్జున. అయితే.. చక్రవర్తికి హీరో అవ్వాలనే లక్ష్యం ఉండటం శివ సినిమా షూటింగ్ లో నాగార్జునకు తెలిసిందట. శివ కాకముందే అందుకే నేటి సిద్ధార్థ అనే సినిమాలో విలన్ గా నటించాడు జేడీ చక్రవర్తి. శివ సినిమా రిలీజ్ కాకముందే.. నేటి సిద్ధార్థ సినిమా షూటింగ్ అయిపోయిందట.
అలా మనీ సినిమాలో అవకాశం వచ్చింది
అయితే.. శివ సినిమా షూటింగ్ లో చక్రవర్తితో మాట్లాడుతున్న సమయంలో.. జేడీ చక్రవర్తి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినట్టు నాగార్జునకు తెలిసి.. తన సినిమాల్లో విలన్ గా అవకాశం ఇవ్వలేదట. ముందు కిల్లర్ సినిమాలో మెయిన్ విలన్ గా చక్రవర్తికి అవకాశం ఇద్దామని అనుకున్నా.. చక్రవర్తి టాలెంట్ చూసి.. చక్రవర్తి హీరోగా అయితే బాగా సెట్ అవుతాడని అనుకొని విలన్ గా ఆ సినిమాలో అవకాశం ఇవ్వలేదట. దీంతో.. ఈ విషయం తెలిసి.. నాగార్జున ఇంటికి వెళ్లాడట చక్రవర్తి. ఏంటి సార్.. నాకు కిల్లర్ లో మెయిన్ విలన్ అవకాశం ఇస్తా అన్నారు. ఇప్పుడు వద్దన్నారట అని చెప్పగానే.. అవును చక్రవర్తి. నువ్వు విలన్ కన్నా హీరోగా బాగా సూట్ అవుతావు.
ఒకవేళ నువ్వు విలన్ గా సినిమాలు చేస్తూ పోతే.. ఇండస్ట్రీలో విలన్ గానే సెట్ అయిపోతావు కానీ.. హీరో ఎప్పటికీ కావు. నువ్వు హీరో మెటిరియల్.. అందుకే నువ్వు హీరోగా ట్రై చేయి.. మంచి అవకాశాలు వస్తాయి. నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు.. అని చక్రవర్తికి నాగార్జున నచ్చజెప్పారట. అలా.. రామ్ గోపాల్ వర్మ సినిమా మనీలో హీరోగా జేడీ చక్రవర్తికి అవకాశం వచ్చిందట. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వరుసగా హీరోగా సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాడు జేడీ చక్రవర్తి. అందుకే.. నాగార్జునకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.. అని అన్నాడు జేడీ చక్రవర్తి.
Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్ లీడర్ ప్రమేయం ఉందని వెల్లడించారు.
ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.
Advertisement
పొలిటికల్ లీడర్.. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.
ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.
Advertisement
పార్టీని కాదు, నాయకుడిని చూడాలి.. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.
Advertisement
హీరో నాని.. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.