Connect with us

Featured

మీనా లైఫ్ లో చేసిన సరిదిద్దుకోలేని తప్పులు ఏంటో తెలుసా !?

Published

on

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో హీరోయిన్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్పట్లో చాలామంది హీరోయిన్లు హీరోలతో పాటు సమానమైన క్రేజ్ ను సంపాదించుకొని సినిమా విజయంలో కీలక పాత్రను పోషిస్తూ ఉండేవారు. అలాంటి వాళ్ళలో సౌందర్య లాంటి హీరోయిన్లు మొదటి వరుసలో ఉంటే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు ఆమె తర్వాత అంత గొప్ప విజయాలను అందుకొని నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్నారు.

ముఖ్యంగా మీనా అయితే ‘సీతారత్నం గారి మనవరాలు’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలందరితో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలందరితో అప్పట్లో చాలా సినిమాల్లో నటించి నటులుగా మంచి గుర్తింపు సాధించుకున్నారు. అప్పట్లో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కూడా మీనా మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఇండస్ట్రీకి పంపించారు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే తన డేట్స్ కావాలంటే వాళ్ళ అమ్మని అడగాల్సిందే. వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా వినేది మీనా. అందులో భాగంగానే చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాల్సిన మీనా కొన్ని సినిమాలను మిస్ చేసుకుంది.

అందులో చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఒక రెండు సినిమాలు మిస్ చేసుకున్నందుకు మాత్రం మీనా ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. అందులో మొదటిది కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘నిన్నే పెళ్ళాడుతా’ సినిమాలో మీనా నే హీరోయిన్ గా తీసుకుందాం అనుకున్నారు. ఆవిడకి స్టోరీ కూడా చెప్పారు. నాగార్జున కూడా అప్పటికే సక్సెస్ లో ఉన్న మీనానే హీరోయిన్ గా ఫిక్స్ చేద్దాం అని చెప్పారట. ఇద్దరూ కలిసి స్టోరీ అ చెప్పారు ఆ స్టోరీ మీనాకి నచ్చింది. దాంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది కానీ ఆ సినిమా కోసం కృష్ణవంశీ 60 రోజులు డేట్స్ అడిగితే మీనా వాళ్ళ అమ్మ కుదరదు అని చెప్పి 20 రోజులు ఇస్తా ఇష్టం చేయండి లేకపోతే కుదరదు అని చెప్పడంతో కృష్ణవంశీ హీరోయిన్ గా టబుని తీసుకున్నాడు. సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో హీరోయిన్ గా టబు కి మంచి పేరు వచ్చింది. అయితే మీనా ఆ సినిమా చూసిన ప్రతిసారి చాలా బాధ పడుతూ ఉంటారని చెబుతూ ఉంటారు.

అలాగే ఈ సినిమా తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర కోసం మొదటగా మీనాని అడిగారు ఆ కథని మీనా కి చెప్పిన దర్శకుడు నీలాంబరి క్యారెక్టర్ ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో మీనాకి కూడా డైరెక్టర్ చెప్పిన కథలో నీలాంబరి క్యారెక్టర్ బాగా నచ్చి చేస్తాను అని చెప్పింది. కానీ అప్పటికే తను హీరోయిన్ గా టాప్ లో ఉంది అలాంటప్పుడు నెగెటివ్ క్యారెక్టర్ లో చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ అమ్మ చెప్పడంతో ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రమ్యకృష్ణ సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. నరసింహ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్బస్టర్ హిట్ గా మిగిలింది.

ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన పాత్ర కి రజనీకాంత్ కంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పాలి. ఇలాంటి మంచి సినిమా మిస్ చేసుకున్నందుకు కూడా మీనా ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు చాలా సినిమాల్లో వారు చేయాల్సిన క్యారెక్టర్ లను మిస్ చేసుకుంటూ వాళ్లకు రావాల్సిన క్రేజ్ వేరే వాళ్ళకి వచ్చింది అని బాధపడుతూ ఉంటారు…

Advertisement
Continue Reading
Advertisement

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!