సర్వం నకీలీ మాయం అయిపోతుంది ఇప్పుడున్న ఈ రోజుల్లో.. ఆఖరికి ఇప్పుడున్న ఈ కరోనా కష్టకాలలో టీకాలు కూడా కల్తీమయం చేస్తున్నారు మోసగాళ్ళు. తాజగా ఒక మోసగాడి మాయలో పడి అనారోగ్యానికి గురయ్యింది హీరోయిన్, ఎంపీ మిమి చక్రవర్తి. వివరాలలోకి వెళితే…

దేవాంజన్ దేవ్ అనే వ్యక్తి తాను కోల్ కతా కార్పొరేషన్ కమీషనర్ నంటూ నమ్మించి కరోనా టీకా కార్యక్రమంలో పాల్గొనాలని హీరోయిన్ మిమి చక్రవర్తిని ఆహ్వానించాడు. కరోనా వ్యాక్సిన్స్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు దూరంచేయండం సామాజిక బాధ్యతగా భావించిన హీరోయిన్ మిమి చక్రవర్తి అతని ఆహ్వానాన్ని మన్నించారు. ఈ నేపధ్యంలో దేవాంజన్ ఏర్పాటు చేసిన టీకా కార్యక్రమంలో పాల్గొన్న మిమి చక్రవర్తి కరోనా టీకా తీసుకోవడం జరిగింది. అయితే తాజగా ఆ శిబిరంలోని వ్యాక్సిన్లు అన్నీ నకిలీవేనని తెలుసుకుని కంగుతిన్నారు మిమి చక్రవర్తి. దీనితో అతనిపై పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ క్రమంలో మోసగాడు దేవాంజన్ ను అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న నకిలీ వ్యాక్సిన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా తాజగా ఈ నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న హీరోయిన్ మిమి చక్రవర్తి పలు అనారోగ్య సమస్యలు తలెత్తడం జరిగింది.

దీనితో ఆమె అనారోగ్యానికి కారణం నకిలీ వ్యాక్సిన్ మాత్రమేనని భావిస్తున్నారు మిమి చక్రవర్తి కుటుంబ సభ్యులు. అయితే ఆమె అస్వస్థతకు నకిలీ వ్యాక్సిన్ కారణం అని ఇప్పటివరకు ఎటువంటి అధరాలు లేవని అంటున్నారు. ఈ నేపద్యంలో మోసగాడు దేవాంజన్ పై మర్డర్ అటెంప్ట్ తో పాటు పలు సెక్షన్స్ క్రింద కేసులు పెట్టారని సమాచారం. మిమి చక్రవర్తి ప్రస్తుతం అధికార పార్టీ ఎంపీగా ఉండడం విశేషం.































