కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్పారు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షలలో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద 65 మందికి కరోనా పోసిటివ్ నిర్ధారణ అయింది. అందులో ఒకరు ఖైరతాబాద్ కు చెందిన వృద్ధుడు (74) మరణించారు. మరో వ్యక్తి ఇప్పటికే ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. వీరిద్దరినీ మినహాయిస్తే తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 63. ఆ 63 మందిలో ఇప్పుడు 10 మందికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 53కు తగ్గనుంది. వారికీ మళ్ళీ పరీక్షలు నివహించనున్నారు. నిబంధనల కరోనా ప్రకారం పరీక్షలు నిర్వహించిన తరువాతే వాళ్ళని ఇంటికి పంపిస్తారు.
































