కరోనా మహమ్మారికి ప్రపంచమంతా వణికిపోతుంది. దాదాపు అన్ని దేశాలలోను కరోనా విజృంభిస్తుంది. మన దేశంలో కూడా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్యా పెరుగుతూ ఉన్నాయి. విరస్ ను కట్టడి చేయడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విజృంభిస్తోంది.. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఈ మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.

ఇప్పటికే కృష్ణాలో ఒక లారీ డ్రైవర్ పేకాట ఆది 26 మందికి కరోనా వైరస్ అంటించాడు. అది మరువక ముందే మరో వ్యక్తి ద్వారా 36 మందికి కరోనా సోకింది. మాచవరం కార్మిక నగర్ కు చెందిన వ్యక్తి కి స్థానికంగా ఒక టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ సెంటర్ ద్వారా 36 మందికి కరోనా వచ్చిందని తెలుస్తోంది. కాగా విజయవాడలోని కృష్ణ లంక, కార్మికనగర్ ప్రాంతాలనుంచి ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.
































