Connect with us

General News

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

Crime News: సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా చికెన్, మటన్ ,

Published

on

Crime News: సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతీ ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా చికెన్, మటన్ , చేపలు ఇలా తెచ్చుకొని ఇంటిల్లిపాది తింటారు. అయితే కొన్ని పల్లెటూర్లలో ఒక నలుగురు.. ఐదుగురు కలిసి.. ఒక గొర్రెను కొనుక్కొని.. దానిని కోసుకొని.. భాగాలు వేసుకొని.. తీసుకుంటారు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !
Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఇలా ఆ గ్రామంలో ఆ గ్రామస్తులంతా పొట్టేలును కొనుక్కొని దానిని ఎల్లమ్మ గుడి దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ దానికి మొక్కలు చెల్లించుకొని.. అమ్మారికి ఆ పొట్టేలును బలి ఇచ్చేందుకు అన్నీ రెడీ చెసేశారు. ఇక బలి కార్యక్రమంలో అతడు పొట్టేలును నరకబోయి.. పక్కనే ఓ వ్యక్తి తలను నరికేశాడు.

Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !
Crime News: దారుణ ఘటన.. పొట్టేలును నరకబోయి..! యువకుడి తల నరికేశాడు.. !

ఆ యువకుడు అక్కిడిక్కడే గిలగిల కొట్టుకొని చనిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. చిత్తూరు జిల్లా మదనపల్లె సమీపంలోని వలసపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి పశువుల పండుగ నిర్వహించారు.

కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా..

గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్లమ్మ గుడికి చుట్టుప‌క్క‌ల ప్ర‌జ‌లంతా వెళ్లి పూజ‌లు నిర్వ‌హించారు . మొక్కుల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చేందుకు సురేష్ అనే యువ‌కుడు పొట్టేలును తీసుకొని వ‌చ్చాడు. అదే గ్రామానికి చెందిన చలపతి పొట్టేలుని నర‌క‌బోయి.. మద్యం మత్తులో సురేష్ తలను నరికేశాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కాగా.. అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చ‌ల‌ప‌తిపై హత్య కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటన కావాలనే చేశారా.. లేదా పొరపాటున జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక ఈ సంక్రాంతి పండుగు బంధువులు, కొత్త అల్లుళ్లతో అంగరంగ వైభవంగా జరగాల్సింది పోయి.. ఇలా విషాదంలో గ్రామం మునిగిపోయింది. ఇక బాధితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ల ఆర్తనాధాలు వర్ణించలేకుండా ఉన్నాయి. ఈ ఘటన ప్రతీ ఒక్కరినీ కన్నీళ్లు తెప్పిచ్చింది.

Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!