శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈచిత్రం కరోనా రెండవ దశ రాకముందే విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లు మూత పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాకు ఏర్పడిన అడ్డంకులను ఇంటిని తొలగించుకొని ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే నేడు(ఆదివారం) హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ విధంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఈ నటుడు నాగచైతన్యతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సింగర్ మంగ్లీ పాల్గొని లవ్ స్టోరీ సినిమాలో ఎంతో ఫేమస్ అయినటువంటి సారంగదరియా పాటను ఆలపించగా అందుకు సాయిపల్లవి రెట్టింపు ఉత్సాహంతో మరోసారి స్టేజ్ పై చిందులు వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాలపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల కోసం మరోసారి సాయి పల్లవి వేదికపై సారంగదరియా స్టెప్పులతో.. అందరినీ సందడి చేసింది.
































