టాలీవుడ్ లో ఇప్పటివరకు తెలుగు అమ్మాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు. ఇలా తన నటన, అందం ,అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించింది హీరోయిన్ అంజలి. ఇటు తెలుగులోనూ.. అటు తమిళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కూడా నటించారు.

వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. అంతేకాకుండా ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో ఆమె నటించారు. ఈ ప్రాతకు ఆమెకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆమె నటనకు పలు సినిమాల్లో ఆఫర్ కూడా కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.
దీనిని దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తోంది. కథ ప్రకారం.. దీనిలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే కియారా అద్వానీని ఎంపిక చేశారు.
మరో హీరోయిన్ గా అంజలి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమాలో కూడా నటించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉండగా.. దీని తర్వాతనే రామ్ చరణ్, శంకర్ కాంబోలో సినిమా షూటింగ్ మొదలవ్వనుందని తెలుస్తోంది.






























