Actress Garima: సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఎక్కువగా రాత్రి సమయాలలో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకోవడం,పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. ఇలా అర్ధ రాత్రి వరకు పబ్ లో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పబ్ వ్యవహారం సంచలనంగా మారిందో మనకు తెలిసిందే.

తాజాగా పబ్ కి సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈసారి పబ్ లో ఎలాంటి మాదకద్రవ్యాల గురించి కానీ లేట్ నైట్ పార్టీల గురించి కాదండోయ్.. ఒక దొంగతనానికి సంబంధించిన వార్త హల్ చల్ గా మారింది. స్నేహితులతో కలిసి నటి పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలోనే సదరు నటి లక్ష రూపాయల విలువ చేసే ఫోన్ ఎవరో దొంగతనం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ గరిమా జైన్కు ముంబై లోని ఒక ప్రముఖ పబ్ లో ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఉన్న పబ్ కి నటి గరిమా ఏప్రిల్ 2వ తేదీ స్నేహితులతో కలిసి వెళ్లారు. ఇలా పబ్ లో ఎక్కువ సమయం పాటు తన స్నేహితులతో కలిసి గడిపిన ఈమె తెల్లవారుజామున 3.15 గంటలకు ఇంటికి వెళ్లాలని బయలుదేరారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు…
ఈ సమయంలో తన స్నేహితులకు ఫోన్ చేయాలని తన ఫోన్ కోసం వెతకగా తన ఫోన్ కనిపించలేదు. ఇలా ఎంత వెతికినా ఫోన్ దొరకకపోవడంతో తన ఫోన్ ఎవరో దొంగిలించారని భావించిన ఈమె ఎంతో ఆందోళన చెందారు.అయితే ఈ నటి పోగొట్టుకున్న ఆ ఫోన్ ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు కావడంతో సదరు నటి తీవ్ర ఆందోళన చెంది వెంటనే పబ్ నిర్వాహకులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా పబ్లిక్ కి వెళ్లి లక్ష రూపాయల ఫోన్ పోగొట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
































