Connect with us

Featured

జయంతి మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆ మూడు కూడా పెటాకులు చేసుకున్నారని మీకు తెలుసా?

Published

on

సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే ఎంతో మంది సెలబ్రిటీలు సినీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండి ఎంతో మంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.ఈ విధంగా సినీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది నటీనటులు నిజ జీవితంలో మాత్రం ఉన్నత స్థానంలో ఉండలేక ఎన్నో బాధలు అవమానాలు పడిన వారు కోకొల్లలు ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఎన్నో కారణాల వల్ల విడిపోయి ఒంటరిగా బతుకుతున్న సెలబ్రిటీలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో సీనియర్ నటి జయంతి ఒకరు.

నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జయంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో మాత్రమే కాకుండా తమిళం కన్నడ భాషలలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె సినీ జీవితంలో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం తన జీవితాన్ని ఉన్నతస్థానంలో నిలుపుకోలేక పోయింది.

జయంతి నిజజీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోలేక చివరి రోజుల వరకు ఒంటరిగా జీవించి తుది శ్వాస విడిచారు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న జయంతి నటుడు పేకేటి శివరామ్‌ను పెళ్లి చేసుకున్నారు. జయంతిని పెళ్లి చేసుకోవడానికి మునుపే ఆయనకు పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ విషయాన్ని దాచి పెట్టి ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఎదుగుతున్న జయంతిని ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో వీరి ప్రేమపెళ్లికి ఎన్టీఆర్ ఏఎన్నార్ కూడా మద్దతు తెలిపారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే వీరికి ఒక బాబు పుట్టిన తర్వాత శివ రామ్ జయంతిని తన చెప్పుచేతుల్లో తీసుకోవాలని చూశాడు. ఈ క్రమంలోనే వీరికి మనస్పర్ధలు రావడంతో అతని నుంచి విడిపోయి సినిమాలలో బిజీగా ఉన్న జయంతికి బండారు గిరిబాబు అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది.గిరిబాబుకి కూడా అప్పటికే వివాహం జరిగి ఉండగా పలు గొడవలు కారణంగానే కొన్ని రోజులకే వీరిద్దరు విడిగా ఉన్నారు. ఆ తర్వాత కన్నడంలో యంగ్ హీరో రాజశేఖర్ ప్రేమలో పడ్డారు జయంతి. తనకన్నా వయసులో చిన్నవాడైనప్పటికీ పలువురు సహాయంతో తనని పెళ్లి చేసుకున్నారు. తనని హీరోగా నిలబెట్టడానికి కోసం ఎంత డబ్బులు కూడా ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడకపోవడంతో రాజశేఖర్ నుంచి దూరమైన జయంతి చివరివరకు ఒంటరిగానే బతుకుతూ చివరి రోజుల్లో ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ మరణించారు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!