Connect with us

Featured

Actress Khushbu: అప్పుడే 32 ఏళ్లు గడచిపోయింది..ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఖుష్బూ!

Published

on

Actress Khushbu: అలనాటి అందాల నటి ఖుష్బూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఖుష్బూ ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఖుష్బూ తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 పైగా సినిమాలలో నటించింది.

ఇప్పటికీ సినిమాలలో కీలకపాత్రలలో నటించడమే కాకుండా రాజకీయాలలోకి కూడా ప్రవేశించి అటు పాలిటిక్స్ ని ఇటు సినిమాలోని సమానంగా హ్యాండిల్ చేస్తుంది. అంతేకాకుండా తెలుగులో బుల్లితెర మీద ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా కుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కుష్బూ నటించిన చిన్నతంబి సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Advertisement

Actress Khushbu: నా గుండె కొట్టుకుంటూనే ఉంది..

1991లో విడుదలైన చిన్నతంబి సినిమాలో కుష్బూ, ప్రభు జంటగా నటించారు. నేటికి ఈ సినిమా విడుదలై 32 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఈ క్రమంలో..” చిన్న తంబి సినిమా విడుదలై 32 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. వాసు ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. నాపై ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారికి, బాలసుబ్రమణ్యం గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నందిని పాత్ర ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు అంటూ” కుష్బూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Advertisement

Featured

Ali: వైసీపీకి రాజీనామా చేసిన నటుడు అలీ.. రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పిన నటుడు!

Published

on

Ali: సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారందరూ కూడా రాజకీయాలలోకి వస్తున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అలీ సైతం రాజకీయాలలో కొనసాగిన సంగతి మనకు తెలిసిందే.

గతంలో పలు పార్టీలలో ఉన్నటువంటి ఈయన 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. ఇలా పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఈయనకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కూడా పదవి అప్పగించారు. ఇక 2024 ఎన్నికలలో తనకు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా టికెట్ వస్తుందని భావించారు.

ఇలా తనుకు టికెట్ వస్తుందని ఆశించిన అలీకి నిరాశ ఎదురయింది. అంతేకాకుండా ఈసారి ఎన్నికలలో పార్టీ తరఫున కూడా ఈయన ప్రచార కార్యక్రమాలను నిర్వహించకుండా పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక వైసీపీ ఘోర ఓటమి పాలు కావడంతో ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు కూడా లేవు.

Advertisement

సామాన్య పౌరుడిగా..
ఇలా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి ఈయన ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా ఇకపై తాను ఎలాంటి రాజకీయ పార్టీలలోకి వెళ్లనని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని తెలిపారు. ఒక సామాన్య పౌరుడిగా మాత్రమే నేను నా ఓటు హక్కును వినియోగించుకుంటానని ఈ సందర్భంగా ఆలీ తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.

Advertisement
Continue Reading

Featured

AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!

Published

on

AP: ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తుతం ఎన్నో సందేహాలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నో ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఒకటో తేదీ రానే వస్తుంది ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేయాలి అంటే తప్పనిసరిగా వాలంటీర్లు అవసరం కనుక జూలై ఒకటో తేదీకి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇలా వాలంటీర్ గురించి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ఇకపై ఉండదని తేల్చి చెప్పారు.

ఇంటింటికి పెన్షన్ అందజేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సచివాలయ ఉద్యోగస్తులను నియమించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండదని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నటువంటి తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. వాలంటీర్లతో పాటు గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లతో ఇంటింటికి వెళ్లి పించని పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే పెన్షన్ల బాధ్యత సచివాలయ సిబ్బందికి అప్పగించారు ఇక రేషన్ పాత పద్ధతిలోనే రేషన్ షాపు వద్దకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి తరుణంలో వాలంటీర్ వ్యవస్థతో పనిలేదని అందుకే వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతుంది. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళనలో వాలంటీర్లు..
గత ప్రభుత్వం 5000 రూపాయల గౌరవ వేతనం చెల్లించింది కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పడంతో ఎంతో మంది వాలంటీర్ ఉద్యోగం పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకు ఓట్లు కూడా వేశారు కానీ గెలిచిన తర్వాత ఇలా వాలంటీర్ వ్యవస్థ గురించి నిర్ణయం తీసుకోకపోవడం వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పడం పట్ల వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Rajamouli: ప్రభాస్ సినిమా.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. రాజమౌళి ఎమోషనల్ కామెంట్స్!

Published

on

Rajamouli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టడంతో ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలకు సంబంధించి గత విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ప్రభాస్ కి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం మాత్రం రాజమౌళి అని చెప్పాలి ఈయన దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాని ద్వారా రాజమౌళి ఎవరు చేయని సాహసం చేశారు.

అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు పెద్దగా క్రేజీ లేదు అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో లేరు అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహంతోనే రాజమౌళి తనపై తాను నమ్మకం ఉంచి ఈ సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా నార్త్ లోకి మంచి ఆదరణ పొందినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Advertisement

నెగటివ్ టాక్..
ఇలా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో తాను చాలా కంగారపడ్డానని ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానని తెలిపారు. కానీ రాజమౌళి విజినరీ ముందు నెగిటివ్ టాక్ కొట్టుకుపోయి ప్రతి ఒక్కరు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే టాక్ కారణంగా సినిమా చూడటానికి వెళ్లి ఈ సినిమాని విజయవంతం చేశారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!