సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో తల్లి, వదిన పాత్రలో, చెల్లెలు పాత్రలో నటించిన పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈ నటి ఆర్థికంగా మోసపోయారని టాలీవుడ్ సమాచారం. పవిత్రా లోకేష్ దాదాపు 60 లక్షల రూపాయల వరకు జిఎస్టి చెల్లింపులు చెల్లించని నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విధంగా నోటీసులు రావడంతో అసలు విషయం బయట పడినట్లు పవిత్ర లోకేష్ తెలిపారు.

కెరియర్ పరంగా తాను ఎంతో బిజీగా ఉండటం చేత ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజర్ కి అప్పగించారు. ఈ క్రమంలోనే తన మేనేజర్ జీఎస్టీ లు చెల్లించకుండా డబ్బును దోచుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయని, మేనేజర్ తనను ఆర్థికంగా చాలా మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విధంగా ప్రభుత్వం నుంచి నటి పవిత్రా లోకేష్ కు నోటీసులు రావడం చేత సుమారు 60 లక్షల వరకు జీఎస్టీలు చెల్లిందని టాలీవుడ్ సమాచారం. ఈ విధంగా కేవలం పవిత్ర లోకేష్ మాత్రమే కాకుండా ఎందరో సెలబ్రిటీలు బిజీగా ఉండడం చేత వారి ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజర్ చేతిలోపెట్టి ఆర్థికంగా లక్షలలో మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.
గతంలో యాంకర్ అనసూయ కూడా ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజర్ చేతిలో పెట్టి భారీగా మోసపోయానని అయితే ప్రభుత్వం నుంచి కట్టాల్సిన జిఎస్టి లకు సంబంధించిన నోటీసులు వచ్చేవరకు తాను మోసపోయానని గ్రహించలేదని ఆ తరువాత డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలమని తెలిపారు.ఈ విధంగా మేనేజర్లు మోసం చేయడంతో ఎంతోమంది నటీనటులు అప్పులపాలైన వారు కూడా ఉన్నారని చెప్పవచ్చు.






























