Adivi Sesh: అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నాగార్జున మినహా తర్వాతి తరం వాళ్లు ఎవరూ కూడా ఇండస్ట్రీలో పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోలేకపోయారని చెప్పాలి.ఇకపోతే అక్కినేని కాంపౌండ్ నుంచి నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఈ సినిమా తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు ఇకపోతే సుప్రియ చాలా రోజుల తర్వాత టాలీవుడ్ హీరో అడివి శేష్ తో కలిసి గూడాచారి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శేష్ ఎప్పటికప్పుడు ఖండించారు.
ఇకపోతే ఈ విషయం గురించి అందరూ మర్చిపోయినప్పటికీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా శేష్ అక్కినేని ఫ్యామిలీతో కలిసి పెద్ద ఎత్తున ఈ వేడుకలను జరుపుకున్నారు. అంతేకాకుండా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో శేష్ సుప్రియ పక్కపక్కనే ఫోటోలు దిగడంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.

Adivi Sesh: వీరి బంధం ఎందుకు బయట పెట్టలేదు…
ఈ క్రమంలోనే వీరి రిలేషన్ గురించి పలువురు చర్చలు జరుపుతూ…వీరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తోందని అయితే ఆ రిలేషన్ బహిరంగంగా బయట పెట్టడానికి ఏదో ఇబ్బంది ఎదురవుతుందని పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. వీరి బంధం బహిర్గతం అవ్వడానికి అడ్డుపడుతున్న ఆ శక్తులు ఏంటి అనేది అందరిలోనూ సందేహం మొదలైంది.
































