సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ దర్శకుడి గురించి సినీ నటుడు వంశీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ తర్వాత ఆ సినిమాలో తనతో పాటు చేసిన వారందరికీ మంచి పేరు వచ్చిందని నటుడు వంశీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ తీసిన సినిమా మంచి హిట్ కొట్టడం, అదీ గాక తనకు ఆ మూవీ నచ్చడంతో ఆయన్ని కలిసి విష్ చేద్దామని అనుకున్నట్టు ఆయన తెలిపారు.

ఆ తర్వాత నెంబర్ తీసుకొని ఆయనకు కాల్ చేసి, ఫిల్మ్ నగర్లో ఒకసారి కలిశానని వంశీ అన్నారు. బొకే ఇచ్చి, మంచి సినిమా తీశారని ఆయనతో మాట్లాడినట్టు వంశీ తెలిపారు. అప్పుడు ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈలోగా మీరే నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వచ్చారు. మనిద్దరం తప్పకుండా కలిసి పనిచేయాలి అని ఆయన తనతో అన్నట్టు వంశీ వెల్లడించారు. ఈ మాట ఆయనే స్వయంగా అన్నారన్న వంశీ, నిజంగా తనను అప్రిషియేట్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని ఆయన అన్నారు. నా నెక్స్ట్ సినిమా ఆయనతో కావాలని గానీ, స్కెచ్ వేసుకొని గానీ అక్కడికి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఆ క్షణం అనిపించింది అతను నిజంగా అంటున్నాని తాను అనుకున్నట్టు వంశీ తెలిపారు.
అతను చాలా మంచి డైరెక్టర్. అతనితో ఎలాంటి విభేదాలూ లేవు. ఆయన గురించి తాను తప్పుగా కూడా ఏమీ అనట్లేదని వంశీ అన్నారు. ఇక్కడ ఎవరి జర్నీ వాళ్లు చూసుకుంటారని, అతనికి ఒక 15కోట్ల సినిమా వస్తే, ఆ తర్వాత అంత కంటే ఎక్కువ బడ్జెట్లో సినిమా తీయాలని అనుకుంటాడని వంశీ తెలిపారు. అంతే తప్ప వంశీ అప్పుడెప్పుడో పుష్ప గుచ్ఛం ఇచ్చాడు. వాడు మంచి యాక్టర్. వాడితో సినిమా తీయాలని వారు ఎందుకనుకుంటారు ఆని పరోక్ష కామెంట్లు చేశారు వంశీ. అలా జరిగిందే తప్ప ఆయన్ని తాను ఏం తప్పు పట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటికీ కూడా ఆయనతో హాయ్, హలోలు నడుస్తూ ఉంటాయి. కానీ, తాను ఆయనకు కలిసింది ఇంకా గుర్తుందా అని తనకు ఎప్పుటినుంచో ఉన్న డౌట్ అని వంశీ అన్నారు. ఒకవేళ భవిష్యత్లో మళ్లీ ఆయనతో చేస్తే నేను మీకు గుర్తున్నానా అని ఆయన్ని అడగాలని ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
































