మనం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట తరచూ వింటూ ఉంటాం. మద్యం తాగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూసే ఉంటాం. మద్యం చాలా కుటుంబాల్లో గొడవలకు సైతం కారణమవుతోంది. అయితే మద్యం వల్ల ఏ విధంగా చూసినా మనకు నష్టాలే తప్ప లాభాలు ఉన్నాయని అనిపించడం లేదు. అయితే నిపుణులు మాత్రం మద్యపానం వల్ల నష్టాలతో పాటు లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

మద్యం మోతాదులో తీసుకుంటే లాభాలు ఉంటాయని ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే మాత్రమే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్, డెమెన్షియా లాంటి వ్యాధులను దూరం చేయడంలో మద్యం సహాయపడుతుందని తెలుపుతున్నారు. మద్యం తాగని వారితో పోలిస్తే మద్యం తాగేవాళ్లు ఈ వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువని తెలుపుతున్నారు. డైమెన్షియా బారిన పడితే మనిషి కొద్దికొద్దిగా మేధస్సును కోల్పోతాడు.
మతిమరుపు, బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం డెమెన్షియా లక్షణాలు. మెదడులోని కణాలు దెబ్బ తినడం వల్ల కలిగే వ్యాధిని అల్జీమర్స్ అంటారు. మనిషి మానసిక స్థితిలో మార్పులకు అల్జీమర్స్ కారణమవుతుందని తెలుపుతున్నారు. కొందరిలో డెమెన్షియా, అల్జీమర్స్ జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని.. మరి కొందరు 60 ఏళ్లు పై బడిన తరువాత అల్జీమర్స్ బారిన పడతారని తెలుపుతున్నారు.
ఒక అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. దీంతో మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టాలే కాదని లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే పరిమితంగా తాగితే మాత్రమే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అపరిమితంగా మద్యం తాగడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు.






























