Hero Yash: కేజిఎఫ్ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్,హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇలా ఈ సినిమా విజయవంతం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కేజిఎఫ్2 తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని వచ్చేనెల 14వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరో యష్ పలు షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
చెమటలు చిందిస్తూ…
ఇక ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా 8 ఏళ్ల కష్టం. లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి ఒక్కరు చెమట చిందిస్తూ ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ సినిమా కోసం అంతగా కష్టపడిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇలా తెరవెనక ఇంత కష్టపడి తెరపై నన్ను చూసి చాలామంది ఈ సినిమా క్రెడిట్ మొత్తం నాకే ఇస్తున్నారు… నిజానికి ఈ క్రెడిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కే చెందాలి అంటూ యష్ కామెంట్ చేశారు. ప్రస్తుతం యశ్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
































