Allu Arjun:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా గత ఏడాది విడుదలయ్యే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఎవరూ ఊహించలేదు.

ఈ విధంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 రానున్న సంగతి మనకు తెలిసిందే. అయితే పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాకు మించి పుష్ప పార్ట్-2 ఉండేలా దర్శకుడు స్క్రిప్ట్ కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారు.ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో పార్ట్ 2 కోసం మరింత బడ్జెట్ కేటాయించనున్నారు.

ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ కూడా తన రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ ,హీరోయిన్ రష్మిక భారీగానే రెమ్యూనరేషన్ పెంచేశారు.తాజాగా అల్లు అర్జున్ సైతం ఈ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
భారీగా పెరిగిన అంచనాలు..
ఈ విధంగా అల్లు అర్జున్ 100 కోట్లు డిమాండ్ చేశారని తెలియడంతో ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.ఒక అల్లు అర్జున్ కోసమే ఈ రేంజ్ లో బడ్జెట్ కేటాయిస్తే ఇక సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి అంటూ ఆరా తీస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సుకుమార్ 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. కేవలం వీరిద్దరి కోసమే మైత్రి మూవీ మేకర్స్ 150 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక త్వరలోనే ఈ సినిమా స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుని సెట్స్ పైకి వెళ్లనుంది.






























