Analyst Damu Balaji : ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ గత కొన్ని రోజులుగా అట్టుడికిపోతోంది. రెండు తెగల మధ్య ఘర్షనతో ఆ రాష్ట్రము అట్టుడుకుతోంది. నెల రోజులుగా జరుగుతున్న మారణకాండలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మణిపూర్ అల్లర్లలో మహిళల నగ్న ప్రదర్శన చేసారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా దేశం మొత్తం అలజడి రేగింది. రెండు తెగల మధ్య ఇంతటి వైరం రావడానికి కారణం రిజర్వేషన్స్ అంటూ పైకి వినిపిస్తున్నా పోలీసులు, ప్రభుత్వ తీరు మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఇక ఆ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మోడీ ప్రభుత్వంను విమర్శించిన జస్టిస్ చంద్ర చూడ్…
మణిపూర్ లో ఆడవారి నగ్న ఊరేగింపు, సామూహిక అత్యాచారం వంటి విషయాలు బయటికి వచ్చినా దేశం మొత్తం విస్మయానికి లోనవ్వగా ప్రధాన మంత్రి ఒక ట్వ్వీట్ చేసి ఊరుకున్నారు. అసలు అక్కడ శాంతి నెలకొల్పడానికి తీసుకున్న చర్యలేమిటో కూడా ఇప్పటివరకు తెలియదు. కావాలనే మణిపూర్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కథనాలు వినపడుతున్న తరుణంలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలను చేసారు. మణిపూర్ లో మే లో అల్లర్లు, మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటూ ప్రశ్నించారు.

ఇక కాపాడాల్సిన పోలీసులే కుకి తెగ ఆందోళనకారులకు మహిళలను అప్పగించినట్లుగా అత్యాచారానికి గురైన మహిళలు ఆరోపించడం పట్ల కూడా ఆయన మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతోందని చెప్పడం బాధాకరం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. నిజానికి మణిపూర్ ఘటన ప్రస్థావించినపుడు మోడీ సర్కార్ మంత్రులు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో అత్యాచారాలు జరగలేదా వాటి పరిస్థి ఏమిటి అంటూ మాట్లాడుతున్నారు. మణిపూర్ లో జరిగిన విషయాలను ముందు చర్చించమంటే ఎదురుదాడికి దిగడం ఎంతవరకు సమంజసం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

































