కరోనాను అంతమోదించడం కోసం నేల్లురూ జిల్లాలోని కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.. అన్ని పరీక్షల తరువాత ఇటీవలే మందు పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

ఈ నేపధ్యంలో మరో 4 రోజుల్లో మందును పంపిణీ చేసేందుకు సిద్దం అవుతున్నారు ఆనందయ్య. ఈ నేపధ్యంలో ఆనందయ్య ఇచ్చే కరోనా మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో ఈ సారి అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఇకపై నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం రావాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసారు. ఆధార్ కార్డ్ చూసి స్తానికులను మాత్రమే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.
మరోవైపు సెక్యూరిటీతో పాటు.. పంపిణీ సులువుగా ఉంటుందని ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని తాజాగా కృష్ణపట్నం పోర్టుకు తరలించారు అధికారులు. ఇకపై ఆనందయ్య ఆయుర్వేద మందుకోసం కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళాల్సిందే..
































