Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మి గత కొద్దిరోజులుగా భారీగా నేటిజన్ల ట్రోలింగకు గురవుతున్నారు.గత కొద్దిరోజులుగా ఈమె ఇలాంటి పోస్టులు చేసిన నేటిజన్స్ ఈమెను టార్గెట్ చేస్తూ భారీగా ట్రోల్ చేస్తుండడంతో ఈమె కూడా వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతున్నారు.

వ్యక్తిగతంగా రష్మి జంతు ప్రేమికురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలపై తనకు ఉన్నటువంటి ప్రేమను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి జంతువులపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ తాను గత కొంతకాలంగా మిల్క్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ కావడంతో కొందరు నేటిజన్స్ గతంలో ఈమె ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభోత్సవానికి వెళ్లినటువంటి ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలను షేర్ చేసిన నెటిజన్స్ ఈ సెలబ్రిటీలు ఎప్పుడూ ఇంతే డబ్బు కోసం క్షణాలలో మాట మారుస్తుంటారంటూ ఈమె గురించి భారీగా ట్రోల్ చేశారు. అయితే ఈ ఫోటోలపై రష్మి స్పందిస్తూ…అవును గతంలో నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను. అయితే గత కొంతకాలంగా తాను పాలను కానీ పాల ఉత్పత్తులను కానీ తీసుకోవడం లేదని ఈమె తెలియజేశారు.

Anchor Rashmi అప్పటినుంచి పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మానేశా…
ఇలా పాలు ఉత్పత్తులు తీసుకోకపోవడం వల్ల ఆ ప్రభావం నాపై ఎలా పడిందో నేను తెలుసుకున్నానని, అయితే పాల ఉత్పత్తులను ఫ్యాక్టరీలలో తయారు చేయడం గురించి స్వయంగా తెలుసుకున్న తర్వాత పాల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం పూర్తిగా మానుకున్నాను అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
And how long ago was this yes I have made my mistakes as I was unaware I stopped drinking milk by default long ago as it gave me acne flare up
But now I have given up on milk products too after in person witnessing the horror or dairy industry https://t.co/0jTgzyv3e2— rashmi gautam (@rashmigautam27) March 2, 2023































