Connect with us

Featured

Anushka Shetty : మళ్ళీ బొద్దుగా తయారైన స్వీటీ.. కొత్త సినిమా కోసం మళ్ళీ సైజు జీరో కి అమ్మడు.. వైరల్ అవుతున్న పిక్స్..!

Published

on

Anushka Shetty : సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అనుష్క ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హిట్టు కొడుతూ లేడీ సూపర్ స్టార్ అయింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించిన ఈ తరం నటీమణులలో ముందుంటుంది అనుష్క. విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, డార్లింగ్ రెబెల్, బిల్లా వంటి చిత్రాలతో గ్లామర్ డాల్ గా మెప్పించిన అనుష్క, ఆ తరువాత అరుంధతి వంటి లేడీ ఓరియంట్ సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. ఇక ఆ తరువాత పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం, రుద్రమదేవి సినిమాలు ఒక ఎత్తు అయితే, బాహుబలి లో దేవసేన గా నటన మరో ఎత్తు. సినిమాకోసం రిస్క్ చేయడం హీరోలకు కామన్ కానీ సినిమాల కోసం హీరోయిన్ రిస్క్ చేయడం అరుదు. ఆది కూడా లావెక్కి తన బాడీ ఫిగర్ ను కోల్పోవడం అంటే హీరోయిన్లు ఒప్పుకోరు. కానీ స్వీటీ అలా కాదు. అందుకే తాను అందరి హీరోయిన్లలో భిన్నంగా హీరోలతో సమానంగా నిలబడింది.

లావెక్కిన బొమ్మాళి… కొత్త సినిమాకోసం మళ్ళీ బొద్దుగా…

సూపర్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకోసం బైక్ చేజింగ్ సన్నివేశాలు చేసిన బొమ్మాళి ఆ తరువాత సైజుజీరో సినిమాకోసం లావుగా తయారైంది. మరో హీరోయిన్ అయితే ఈ సాహసం చేయాలంటే ఆలోచించేవాళ్లేమో కానీ అనుష్క ఏ మాత్రం ఆలోచించకుండా లావుగా చబ్బిగా తయారైంది. అయితే అనుష్క కష్టపడినా సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఇక మళ్ళీ సన్నబడటానికి చాలా కష్టపడిన స్వీటీ మళ్ళీ ఇపుడు సినిమా కోసం లావైంది.

Advertisement

తాజాగా వైరల్ అవుతున్న అమ్మడి ఫోటోల్లో బొద్దుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల తరువాత మళ్ళీ సినిమాలో నటిస్తున్న అనుష్క నిశ్శబ్దం సినిమా తరువాత మరే సినిమా చేయలేదు. మళ్ళీ ఇన్నాళకు నవీన్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్న అనుష్క సినిమా కోసం మళ్ళీ లావుగా తయారైనట్లు అనిపిస్తోంది. బొద్దుగా ముద్దుగా ఉన్న స్వీటీ ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమా కోసం ఏదైనా చేస్తుంది అనుష్క అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!