భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగు అమ్మాయి రజినీకి ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. టోక్యో నుంచి తిరిగి వచ్చిన రజనీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో క్యాంపు ఆఫీసులో సమావేశం అయ్యింది. రజనీకి 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. దాంతో పాటు ఆమె కోరుకున్నట్టుగా తిరుపతిలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించారు. నెలకు 40 వేల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కూడా అధికారులను జగన్ ఆదేశించారు.

కాగా గత ప్రభుత్వ హయాంలో రజనీకి ప్రకటించిన ప్రోత్సహకాలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. వాటిని సత్వరం కేటాయించాలని కూడా జగన్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
.



































