Big Boss Non Stop: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లను పూర్తి చేసుకొని ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా 24 గంటల పాటు ప్రసారం అవుతుంది.ఇకపోతే మొదటివారం నామినేషన్ లో భాగంగా ఏడు మంది కంటెస్టెంట్ లో వున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ ఏడుగురిలో ముమైత్ ఖాన్, సరయు మినహా మిగిలిన కంటెస్టెంట్ లు అందరూ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్లారు. వీరిద్దరు మాత్రమే మిగిలి ఉండగా సరయు బిగ్ బాస్ ప్రకటించక ముందే తాను ఇక ఇంటిలోనుంచి వెళ్లిపోతానని ఖచ్చితంగా ప్రేక్షకులు తనను ఎలిమినేట్ చేసి ఉంటారని భోరున ఏడ్చింది.

తన పట్ల ప్రేక్షకులు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారని బిగ్ బాస్ హౌస్ లోన్ తన ఉండటం ప్రేక్షకులు కూడా ఆదరించకపోతున్నారని, బిగ్ బాస్ నుంచి తానే ఎలిమినేట్ అయ్యేది అంటూ బోరున ఏడ్చారు. ప్రేక్షకులకు ఇంత వ్యతిరేకత ఎందుకంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
ఆ అనుభవంతోనే బోరున ఏడ్చిన సరయు….
సరయు ఇదివరకే బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో ఈమె ఎవరు ఊహించని విధంగా మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ అనుభవం రీత్యా నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా ఈమె మొదటి వారమే నామినేషన్ లిస్టులో ఉండటంతో ఈసారి కూడా తానే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతానని భావించి బోరున ఏడ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈవారం ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.


































