డిసెంబర్ 8న కొన్ని రైతు సంఘాలు భారత్ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపద్యంలో టిఆర్ఎస్ పార్టీని తప్పు పట్టారు తెలంగాణ రాష్ట్ర బారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు టిఆర్ఎస్ కు లేదని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మీ పార్టీ నాయకులను నియమించుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారు. దళారులతో కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని, అసలు మార్కెట్ కమిటీలను రద్దు చేయాలనీ, ఈ నిర్వహణ మొత్తం రైతు సంఘాలకే అప్పజెప్పాలని అయన సూచించారు.


































