దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ ఈ మధ్య కాలంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడానికి కీలక ప్రకటనలు చేస్తోంది. వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ మరో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ తమ కస్టమర్లకు ఉచితంగా 50 జీబీ అందించడానికి సిద్ధమైంది. అయితే ఈ ఆఫర్ ను పొందాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతులకు అంగీకరించిన వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులవుతారు.

ఎయిర్ టెల్ ఎవరైతే ఫీచర్ ఫోన్ నుంచి 4జీ హ్యాండ్ సెట్ కు మారిపోతారో వారికి మాత్రమే 50 జీబీ డేటా ద్వారా ప్రయోజనం కలిగేలా చేస్తోంది. ఫీచర్ ఫోన్ నుంచి 4జీ ఫోన్ కు మారిన కస్టమర్లు ఐదు అన్ లిమిటెడ్ రీఛార్జీలు చేసుకుని ఈ డేటా ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి అర్హులవుతారు. ఒక అన్ లిమిటెడ్ రీఛార్జ్ కు 10జీబీ డేటా చొప్పున ఐదు అన్ లిమిటెడ్ రీఛార్జీలకు 50జీబీ డేటాను పొందవచ్చు.
సాధారణంగా పండుగ సమయాల్లో చాలామంది కస్టమర్లు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ప్రయోజనం చేకూర్చడానికి ఎయిర్ టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ టెల్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ పొందడానికి అర్హులవుతారు. అప్ గ్రేడ్ అయ్యే కస్టమర్లు ఓటీటీ బండిల్ ఆఫర్స్, హైస్పీడ్ మొబైల్ ఇంటర్నెట్ ను పొందవచ్చని ఎయిర్ టెల్ చెబుతోంది.
టెలీకాం రంగంలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ టెల్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం వన్ ఎయిర్ టెల్ ప్లాన్స్ ను కూడా అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. వన్ ఎయిర్ టెల్ ప్లాన్స్ ను రీచార్జ్ చేసుకుంటే మొబైల్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్, డీటీహెచ్ సర్వీసులను ఒకే ప్లాన్ తో పొందే అవకాశం ఉంటుంది.





























