Connect with us

Featured

నితిన్ “భీష్మ” ట్విట్టర్ రివ్యూ : నాన్ స్టాప్ నవ్వులే నవ్వులు…! నితిన్ హిట్ అందుకున్నట్టేనా?

Published

on

నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం “భీష్మ” మహా శివరాత్రి కానుకగా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్.. మరో పక్క ఫుల్ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ అభిమానులు… మరి నితిన్ తాజా చిత్రం “భీష్మ” అటు అభిమానులు ఇటు నితిన్ ల దాహం తీర్చిందా?? అవుననే అంటున్నారు. నితిన్ గట్టిగానే హిట్ కొట్టాడట. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై విమర్శకుల ప్రసంశలు అందుకుని తన సత్తా చాటుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి డైరెక్టర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా హీరో నితిన్, హీరోయిన్ రష్మిక తో కలిపి ఈ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇప్పటికే యూ ఎస్ లో ప్రీమియర్ షోలు చూసేసారు అక్కడి ప్రేక్షకులు. ఈ చిత్రం చుసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలూ వెల్లడిస్తున్నారు. సినిమా చాలా బాగుందని , కామెడీ అయితే చింపేసాడని ట్వీట్ చేస్తున్నారు.

Advertisement

ఫస్టాఫ్ గురించి చెబుతూ.. భీష్మ బొమ్మ అదిరిందట. ఫస్టాఫ్ మొత్తం కామెడీ ట్రాక్ నడిచిందట. “గుండెజారి గల్లంతయిందే” సినిమా తరువాత నితిన్ ఆ రేంజ్ కామెడీ చేయడం ఇదే అంటున్నారు. ఇంటర్వెల్ లో అద్భుతమైన ట్విస్ట్ కూడా ఉంటుందట. అవుట్ అండ్ అవుట్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడని. బోర్ అనే ఫీల్ లేకుండా సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాలతో దర్శకుడు ఫస్టాఫ్ నడిపించాడట. చాలా రోజుల తరువాత నితిన్ కు కరెక్ట్ రోల్ దొరికిందని అంటున్నారు. తన క్యారెక్టర్ తో నితిన్ అదరకొట్టేసాడని అంటున్నారు.

ఇక సెకెండ్ హాఫ్ అసలు కథలో కి ప్రవేస్తారట. కొంచెం లాగ్ అనిపించినా దాన్ని కామెడీతో, కమర్షియల్ స్టఫ్ తో కవర్ చేసారని తెలుస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా అదిరిపోయిందని. మంచి ఎంటర్టైనింగ్ మూవీ అని ట్వీట్లు చేస్తున్నారు. వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకి హైలైట్ అంటున్నారు. ఇక హీరోయిన్ రష్మిక కూడా తన పాత్రకి తగిన న్యాయం చేసిందని, డైరెక్టర్ వెంకీ కుడుముల సింగల్ లైన్ డైలాగ్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. “అక్కకి లేక అడుక్కుతింటుంటే.. చెల్లి వచ్చి చికెన్ కావాలందట” ఇలాంటి డైలాగ్స్ థియేటర్లో అరుపులు పుట్టించాడట.

భీష్మ సినిమా కొన్ని గత సినిమాలను గుర్తు చేసినా కూడా డైరెక్టర్ వెంకీ కుడుముల తనదైన శైలిలో కామెడీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ గుప్పించి చూసే ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా చేసాడని టాక్. స్టోరీ లైన్ కాస్త వీక్ అని అనిపించినా… అది పెద్దగా సినిమా ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులు అది మర్చిపోయేలా ఉందని అంటున్నారు. మొత్తానికి “భీష్మ” సినిమాతో డైరెక్టర్ గా వెంకీ కుడుముల, హీరోగా నితిన్ హిట్ కొట్టారని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చి పెట్టె సినిమా అని అంటున్నారు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!