బుల్లితెరపై మరి కొద్ది రోజులలో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం గురించి రోజురోజుకు ప్రేక్షకులలో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఈ కార్యక్రమం వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రసారంకానున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కూడా నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ కొందరి పేర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నబోయేవారి ఫైనల్ లిస్ట్ ఇటీవలే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్ లలో యాంకర్ రవి, సీరియల్ నటి సిరి హనుమంత, సీనియర్ ఆర్టిస్ట్ ప్రియా, కార్తీకదీపం ఉమా, జస్వంత్, సిరి, ఆర్ జే కాజల్, tv9 ప్రత్యూష, నటుడు విశ్వ, నిఖిల్, సన్నీ, లోబో, యూట్యూబర్ షణ్ముఖ జస్వంత్, సరయు, లహరి, శ్వేతా వర్మ వంటి వారి పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి.
ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం హౌస్ లోనికి వెళ్లనున్నారు. అదేవిధంగా హౌస్ లోకి వెళ్లే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా రెండు డోస్ ల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకున్నాకనే కంటెస్టెంట్ లను లోపలికి పంపించనున్నారు. ఈ క్రమంలోనే ఈ కంటెస్టెంట్స్ అందరిని ఆగస్టు 22వ తేదీన క్వారంటైన్ కి పంపించి, అక్కడి నుంచి సరాసరి బిగ్ బాస్ హౌస్ లోనికి ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.






























