బిగ్ బాస్ సీజన్ 5 ప్రతీ రోజూ ఎదో ఒక ట్విస్ట్ తో రన్ అవుతోంది. అయితే ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది కేవలం 17 మంది మాత్రమే. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అది ఇంతవరకు జరగలేదు. అయితే సీజన్ 4 లో అవినాశ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఎంతో కొంత కామెడీని పంచారు.

కానీ ఈ సారి ఆలోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సారి చాలామంది తెలియని వారే హౌస్ లోకి వెళ్లారు. అయితే మొదట ఎలిమినేట్ అయిన సరయు వారానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే రెండో వారంలో ఎలిమినేట్ అయిన ఉమాదేవి రెండు వారాలకు ఎంత తీసుకున్నారనే ఉత్సుకత ప్రతీ ఒక్కరిలో ఉంది.
ఆమె రెండు వారాలకు వారానికి రూ.80 వేల చొప్పును రూ.1.60 తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీజన్ 4 కంటే కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్కు భారీగానే చెల్లిస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే యాంకర్ రవి ఎక్కవ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. రెండవ వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తీక దీపంలో ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. అటు సినిమాల్లోను, ఇటు సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయిపోయారు ఉమా.
తనదైన శైలిలో హౌస్ లో అందరినీ ఆకట్టుకున్నా.. ఉమాదేవి నోటి దురుసు వల్ల బయటకు రావాల్సి వచ్చిందంటూ టాక్ వినపడుతోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం అవుతున్నదేంటంటే.. హౌస్ లో ఉండే వాళ్లను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు.. వాళ్లు మాట్లాడే భాష అసభ్యకరంగా ఉంటే రిసీవ్ చేసుకోవట్లేదని తెలుస్తోంది. దాని కారణంగానే ఉమా, సరయు కూడా బయటకు వచ్చినట్లు సమాచారం.
































