Connect with us

Featured

Bollywood Actress: నా చావు కోసం బాలీవుడ్ ఎదురుచూస్తోంది.. పనిమనిషి ద్వారా విష ప్రయోగం చేశారు!

Published

on

Bollywood Actress:గత కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడంటూ వార్తలలో నిలిచారు నటి తనుశ్రీ దత్తా.అయితే తాజాగా ఈమె మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తను శ్రీ దత్త బాలీవుడ్ తన చావు కోసం ఎదురు చూస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో కొందరు మొదటి నుంచి నాకు అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా తనను తొక్కేయాలని చూస్తున్నారు. అలాగే నా పనిమనిషి ద్వారా నాపై విష ప్రయోగానికి కూడా ప్రయత్నం చేశారని ఈమె వెల్లడించారు. తను వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ చేసిన తాను బయటపడ్డాను నేను ఈ బాలీవుడ్ మాఫియా పై పోరాటం వదిలిపెట్టనని ఘాటుగా స్పందించారు.

Advertisement

ఇలా ఇండస్ట్రీలో నేను లేకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తాను మాత్రం ఇండస్ట్రీని వదిలి వెళ్ళనని వెల్లడించారు. ఇకపోతే తన పనిమనిషి ద్వారా నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు. ఇలా బాలీవుడ్ మాఫియా అంటూ ఏమి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈమెకు అండగా రాజకీయ నాయకులు…

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు తనకు మద్దతుగా నిలబడగా మరికొందరు మాత్రం ఈమె ఇండస్ట్రీలో అటెన్షన్ సంపాదించుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈమె మాటలు వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని రాజకీయాల కోసమే తన చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అంటూ తనుశ్రీ గురించి స్పందించారు. అయితే ఈమధ్య కాలంలో ఈమె రాజకీయాలకు సంబంధించిన పోస్టులు పెట్టడమే ఇలాంటి అనుమానాలకు కారణమని చెప్పాలి.

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial)

Advertisement

Featured

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Published

on

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

Advertisement

Continue Reading

Featured

Lakshmi Parvathi: ఎన్నికల వేళ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన లక్ష్మీపార్వతి.. ఐక్యం కావాలంటూ?

Published

on

Lakshmi Parvathi: సీనియర్ ఎన్టీఆర్ సతీమణి వైసిపి నాయకురాలు లక్ష్మీపార్వతి బుధవారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కపటం లేని మంచి మనిషి అని తెలియజేశారు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుని నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు.

తన సొంత మామయ్యని వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు నాయుడుది. పిఠాపురంలో కాపులందరూ కూడా ఐక్యం కావాలని తెలిపారు. ఇలా కాపులందరూ కూడా వైసిపి అభ్యర్థి వంగా గీతకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు వంగా గీత స్థానిక నేత ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆమె వెంటనే స్పందిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని తెలిపారు.

Advertisement

పవన్ కళ్యాణ్ వలస వచ్చారు..
పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వలస వచ్చారని ఈమె తెలిపారు. కానీ వంగా గీత స్థానికురాలు. అందుకే వంగా గీతకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించాలని ఈమె కోరారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భాగంగా గాజువాక భీమవరం నుంచి పోటీ చేసినటువంటి ఈయనకు రెండు చోట్ల చేదు అనుభవాలే ఎదురయ్యాయి ఇలా రెండు ప్రాంతాలలో ఓటమిపాలు అయినటువంటి పవన్ కళ్యాణ్ కాపు ఓట్లు అధికంగా ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీకి దిగారు.

Advertisement
Continue Reading

Featured

Janasena: జనసేనకు ఎవరు ఓటు వేయద్దు.. నాగబాబు మాజీ అల్లుడు కామెంట్స్ వైరల్!

Published

on

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కూటమిలో భాగంగా 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనసేన ప్రచార కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.

మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా సినీ సెలబ్రిటీలు మొత్తం తరలి వస్తున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురంలో పర్యటన చేయగా చిరంజీవి రామ్ చరణ్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు అయితే తాజాగా జనసేన నేతలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య భారీ షాక్ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా ఈయన జనసేన పార్టీకి ఓటు వేయొద్దని తెలియజేశారు. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా తెగిస్తుందని తెలిపారు. ప్యాకేజీ కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుంది. జనసేన సిద్ధంతాలను పవన్ కళ్యాణ్ కూడా పాటించరు. ఆయన మాటలకు చేష్టలకు ఏమాత్రం పొంతన ఉండదని తెలిపారు.

Advertisement

ఆర్టిస్టులను భయపెడుతున్నారు..
చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే మెగా ఫ్యామిలీ పని చేస్తుందని, ప్రచారాలకు రాకపోతే తమకు అవకాశాలు లేవని ఆర్టిస్టులను భయపెట్టి ప్రచార కార్యక్రమాలకు తీసుకువస్తున్నారని తెలిపారు. ఇలా ఎంతోమంది జనసేనను నమ్మి మోసపోయారు అంటూ ఈ సందర్భంగా వెంకట చైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!