Bollywood Actress:గత కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడంటూ వార్తలలో నిలిచారు నటి తనుశ్రీ దత్తా.అయితే తాజాగా ఈమె మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తను శ్రీ దత్త బాలీవుడ్ తన చావు కోసం ఎదురు చూస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో కొందరు మొదటి నుంచి నాకు అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా తనను తొక్కేయాలని చూస్తున్నారు. అలాగే నా పనిమనిషి ద్వారా నాపై విష ప్రయోగానికి కూడా ప్రయత్నం చేశారని ఈమె వెల్లడించారు. తను వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ చేసిన తాను బయటపడ్డాను నేను ఈ బాలీవుడ్ మాఫియా పై పోరాటం వదిలిపెట్టనని ఘాటుగా స్పందించారు.

ఇలా ఇండస్ట్రీలో నేను లేకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తాను మాత్రం ఇండస్ట్రీని వదిలి వెళ్ళనని వెల్లడించారు. ఇకపోతే తన పనిమనిషి ద్వారా నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు. ఇలా బాలీవుడ్ మాఫియా అంటూ ఏమి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈమెకు అండగా రాజకీయ నాయకులు…
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు తనకు మద్దతుగా నిలబడగా మరికొందరు మాత్రం ఈమె ఇండస్ట్రీలో అటెన్షన్ సంపాదించుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈమె మాటలు వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని రాజకీయాల కోసమే తన చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అంటూ తనుశ్రీ గురించి స్పందించారు. అయితే ఈమధ్య కాలంలో ఈమె రాజకీయాలకు సంబంధించిన పోస్టులు పెట్టడమే ఇలాంటి అనుమానాలకు కారణమని చెప్పాలి.
View this post on Instagram

































